ఫ్లోరిడాలోని 'సిక్కు సమాజ' ప్రధాన గురువు ఈశ్వర్సింగ్ అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో మొట్టమొదటి సారిగా సిక్కు మత ప్రార్థనలు నిర్వహించి చరిత్ర సృష్టించారు. ఇరవై రోజుల క్రితం అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన అల్లర్లలో ఆరుగురు సిక్కు మతస్థులు ప్రాణాలిడిచిన సంగతి తెలిసిందే. సిక్కులకు తగిలిన గాయాన్ని రిపబ్లికన్ పార్టీ నయం చేయాలనుకుంది.ఈ మేరకు తమ పార్టీ జాతీయ సదస్సులో ప్రార్థనలు నిర్వహించేందుకు అమెరికాలో చరిత్రలోనే ఒక సిక్కు గురువుకు మొదటిసారిగా అవకాశమిచ్చింది. 40 ఏళ్ల క్రితం అమెరికాలో అడుగుపెట్టినప్పుడు ఒక సిక్కు గురువు ఒక వేదికపై అమెరికన్లకు ప్రార్థనలు నిర్వహిస్తాడని ఊహించలేదని, ఈ అవకాశం రావడం తనకే కాక, అమెరికాలోని సిక్కు ప్రజలందరికీ గర్వకారణమని చెప్తూ ఈశ్వర్సింగ్ ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యారు. ఈశ్వర్సింగ్ ప్రార్థనలతో సదస్సు రెండో రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి.
'ఇక్కడ నిలబడి ఒక సిక్కుగా, ఒక అమెరికన్గా ప్రార్థనలు చేయడం నాకు చాలా గొప్పగాఉంది.మా దేశంలో స్వేచ్ఛకు, సమానత్వానికి సుస్థిర స్థానముందని చెప్పడానికి గర్విస్తున్నాను' అని ఆయన ఈ సదస్సులో అన్నారు. అల్లర్ల గురించి మాట్లాడుతూ 'ఇటీవల ఓక్క్రీక్లోని గురుద్వారాలో చెలరేగిన హింస పట్ల మనమంతా చాలా బాధపడుతున్నాం, ఇక నుం చి ఇతరుల పట్ల మన మనసుల్లోని అసహ్య భావాన్ని తుడిచేద్దాం. మనమంతా ఒకే దేశ ప్రజలమని, ఒకే దేవుడి నీడలో ఉన్నామని గుర్తుచేసుకుందాం' అని అన్నారు. సిక్కు ప్రధాన నియమాలైన స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వం వంటి వాటికి అమెరికా నీతి సూత్రాల్లో సముచిత స్థానం ఉందని, ఈ సదస్సు వేదికగా సిక్కు మత స్ఫూర్తిని అమెరికన్లతో పంచుకునేందుకు గొప్ప అవకాశం దొరికిందని సదస్సుకు వచ్చే ముందు ఆయన పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more