మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి షిర్డి వెళ్తున్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు ఈ రోజు తెల్లవారుజామున షోలాపూర్ సమీపంలోని నల్దుర్గ్ వద్ద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 34మంది దుర్మరణం చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. వీరిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా మనరాష్ట్రానికి చెందినవారే. మృతుల్లో అయిదుగురిని ఇంతవరకు గుర్తించారు. బస్సులో మొత్తం 43 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ లక్డీకాపూల్ నుంచి బయలుదేరిన బస్సు ఈరోజు వేకువజామున మూడు గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులు షోలాపూర్లోని అశ్విని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
షిర్డీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్బ్రంతి వ్యక్తం చేశారు. తక్షణమే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వేద్యసేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదిని ఆదేశించారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడి తగు సహాయం అందించేందుకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందించడం కోసం ప్రభుత్వం తరపున అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు.
షిర్డీ వెళ్లాలని చాలామంది బయలుదేరారు. శని, ఆది వారాలు సెలవు దినాలు కావడంతో సాప్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదానికి లోనైన షిర్డీ బస్సులో 14 మంది టీసీఎస్ సాప్ట్ వేర్ సంస్థకు చెందిన ఉద్యోగులే ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు సమాచారం అందించేలా రెండు హెల్ప్ లైన్ నెంబర్లు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రమాణికుల వివరాల కోసం 02472-222700, 02472-222900 లను అందుబాటులోకి తెచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more