కోఠిలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. కస్టడీలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి ని ఇక్కడే విచారించాలని సీబీఐ అధికారులు నిర్ణయించనున్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీబీఐ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. వైఎస్ జగన్ ను ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇవ్వడంతో అధికారులు విచారణకు ఏర్పాట్లు చేశారు. కోఠిలోని సీబీఐ కార్యాలయంలోనే జగన్ ను విచారించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీబీఐ వాదనతో హైకోర్టు ఏకీభవించి కస్టడీకి అనుమతించడంతో సీబీఐ ఆఫీసు వద్ద బారీ కేడ్లను ఏర్పాటు చేశారు.ఐతే జగన్ కేసు కు సంబంధించిన దర్యాప్తు దిల్ కుషాగెస్ట్ హౌజ్ లో జరుగుతుండగా ఆయన్ను మొదట మూడురోజుల పాటు అక్కడే విచారించారు. అయితే జగన్ వచ్చి వెళ్లే వరకు రోడ్డు మూసివేయడం.. ట్రాఫిక్ ఆంక్షలు విధించడం.. వంటి వాటితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు జగన్ ను కోఠిలోని సీబీఐ కార్యలయంలోనే విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సీబీఐ ప్రధాన కార్యాలయం చంచల్ గూడ జైలు కు సమీపంలో ఉండటంతో అక్కడే విచారిస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని సీబీఐ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.విచారణ జరిగే ఐదు రోజులు సీబీఐ కార్యాలయ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. .మీడియా ప్రతినిధులకు బయటే మీడియా పాయింట్ ను ఏర్పాటు చేశారు.ఐతే సీబీఐ ప్రధాన కార్యాలయం ఉన్న భవనంలో ఇంకా అనేక కేంద్ర,,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కార్యాలయాలున్నాయి.ఈ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు ఇబ్బందికలగకుండా ఐడీ కార్డు చూసి అనుమతిస్తారు. దీనికోసం ఈ కార్యాలయం వద్ద రోజువారీ విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సహాయాన్ని పోలీసులు తీసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more