Jagan at koti

jagan at koti

jagan at koti

7.gif

Posted: 06/03/2012 02:17 PM IST
Jagan at koti

       కోఠిలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. కస్టడీలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి ని ఇక్కడే విచారించాలని సీబీఐ అధికారులు నిర్ణయించనున్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీబీఐ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. వైఎస్ జగన్ ను ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇవ్వడంతో అధికారులు విచారణకు ఏర్పాట్లు చేశారు. కోఠిలోని సీబీఐ కార్యాలయంలోనే జగన్ ను విచారించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీబీఐ వాదనతో హైకోర్టు ఏకీభవించి కస్టడీకి అనుమతించడంతో సీబీఐ ఆఫీసు వద్ద  బారీ కేడ్లను ఏర్పాటు చేశారు.ఐతే జగన్ కేసు కు సంబంధించిన  దర్యాప్తు  దిల్ కుషాగెస్ట్ హౌజ్ లో జరుగుతుండగా ఆయన్ను మొదట మూడురోజుల పాటు అక్కడే విచారించారు. అయితే జగన్ వచ్చి వెళ్లే వరకు రోడ్డు మూసివేయడం.. ట్రాఫిక్ ఆంక్షలు విధించడం.. వంటి వాటితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు జగన్ ను కోఠిలోని సీబీఐ కార్యలయంలోనే విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.4
       సీబీఐ ప్రధాన కార్యాలయం చంచల్ గూడ జైలు కు సమీపంలో ఉండటంతో  అక్కడే విచారిస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని సీబీఐ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.విచారణ జరిగే ఐదు రోజులు సీబీఐ కార్యాలయ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. .మీడియా ప్రతినిధులకు బయటే మీడియా పాయింట్ ను ఏర్పాటు చేశారు.ఐతే సీబీఐ ప్రధాన కార్యాలయం ఉన్న భవనంలో ఇంకా అనేక కేంద్ర,,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కార్యాలయాలున్నాయి.ఈ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు ఇబ్బందికలగకుండా ఐడీ కార్డు చూసి అనుమతిస్తారు. దీనికోసం ఈ కార్యాలయం వద్ద రోజువారీ విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సహాయాన్ని పోలీసులు తీసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Summer heat
Ap government green signal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles