ప్రస్తుతం అమలు చేయబోతున్న ఈ ఐడియాని చూస్తే... సామెత మాదిరి ఉంది. తనకు చేతకాక ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలకు వినూత్న పరిష్కారం కనుగొమని ప్రజలకే సూచిస్తుంది. విషయం ఏంటంటే... ఏదైనా సమస్య పరిష్కారానికి మీ దగ్గర ఓ అద్భుతమైన ఐడియా ఉందా!? మీరు చెవినిల్లు కట్టుకుని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదా!? మీరు నిరాశ చెందొద్దు! మీ ఐడియాను ప్రభుత్వానికి చెప్పండి! ఆ సమస్య పరిష్కారం కావడమే కాదు.. మీకు పెద్దఎత్తున నగదు బహుమతి కూడా రానుంది!
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 'ఒక ఎంపీ - ఒక ఐడియా' పేరిట కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పార్లమెంటు సభ్యుల ప్రాంతీయ అభివృద్ధి పథకం (ఎంపీ ల్యాడ్స్) కింద కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల నిర్వహణ శాఖ ఈ పథకాన్ని ప్రకటించింది. స్థానిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను కనుగొనేందుకు ఈ పథకాన్ని చేపడుతున్నట్లు కేంద్ర కార్యక్రమాల నిర్వహణ శాఖ మంత్రి శ్రీకాంత్ జెనా సోమవారం ప్రకటించారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గంలోని స్థానిక ప్రజల నుంచి వివిధ సమస్యలకు వినూత్న పరిష్కారాలను సేకరించి.. ఏటా మూడు ఉత్తమమైన ఆలోచనలకు నగదు బహుమతిని అందజేస్తామని తెలిపారు. ఈ పథకాన్ని ఆయా లోక్సభ సభ్యుల విజ్ఞప్తిమేరకు వారి నియోజకవర్గాల్లో అమలు చేస్తామన్నారు. వచ్చిన పరిష్కారాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని, మూడు ఉత్తమ పరిష్కారాలను ఎంపిక చేస్తుందని, ఎంపికైన వాటిలో మొదటి బహుమతి కింద రూ.2.5 లక్షలు; రెండో బహుమతి కింద రూ.1.5 లక్షలు; మూడో బహుమతి కింద రూ.1 లక్ష అందజేస్తామని తెలిపారు. ఈ బహుమతులను ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా అందజేస్తామన్నారు. వీటితోపాటు ఐదు వినూత్న పరిష్కారాలకు ప్రోత్సాహక సర్టిపికెట్లు ఇస్తామని తెలిపారు.
ఇలా ఆశ పెట్టించి వినూత్న ఐడియాలు అన్నీ తెలుసుకొని చివరకు ఐడియాలు ఇచ్చిన వారికి హ్యాండ్ ఇవ్వదు కదా ?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more