Jagan and roja blame chiranjeevi

jagan and roja blame chiranjeevi

jagan and roja blame chiranjeevi

9.gif

Posted: 05/01/2012 04:30 PM IST
Jagan and roja blame chiranjeevi

       కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఆ పార్టీ నేత రోజా తమ దైన శైలిలో విమర్శించారు.  తిరుపతి నియోజకవర్గ ప్రజల్ని, వారి సమస్యల్ని పట్టించుకోకుండా చిరంజీవి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు. ఎమ్మెల్యేగా తిరుపతి నియోజగవర్గానికి చిరంజీవి చేసింది ఏమీ లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. jagaత్వరలో సువర్ణయుగం వస్తుందని వైఎస్ జగన్ అన్నారు. గాలేరు-నగరి ప్రాజెక్ట్ పూర్తి చేసి తిరుపతి ప్రజలకు తాగునీటిని అందిస్తానని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన తిమ్మనాయుడు పాలెంలో పర్యటించారు.
      కాగా, చిరంజీవి వ్యక్తిగత స్వార్థంతో పాటు పదవీ కాంక్షతో తిరుపతి అసెంబ్లీకి రాజీనామా చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రోజా ఆరోపించారు. పార్టీని నడపలేక ఆయన కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారని ఆమె విమర్శించారు.roja మరోవైపు తొమ్మిదేళ్ల పాలనలో చిత్తూరు జిల్లాకు కానీ, తిరుపతి నియోజకవర్గానికి కానీ చంద్రబాబు చేసింది ఏమీ లేదని రోజా మండిపడ్డారు. తిరుపతి ఉపఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆమె అన్నారు.
      ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ్టి నుంచి ఉప ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు.  తిరుపతి సమీపంలోని తిమ్మినాయుడు పాలెం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు.  టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అప్పట్లో తొలిసారిగా ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించడం విశేషం ఈ విడతలో 8 నియోజకవర్గాల్లో అవిశ్రాంతంగా 18 రోజుల పాటు ప్రచారం చేయనున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader chandra babu naidu anantapur election campaign
Panic incident in east godavari district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles