మీరు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాలనుకుంటున్నారా? చదువు పేరు చెప్పి అక్కడే స్థిరపడాలనుకునే వారికి కేంద్రం షాక్ ఇవ్వబోతుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే వైద్య విద్యార్థులు విద్యాభ్యాసం తర్వాత భారతదేశానికి తిరిగి వస్తామని బాండ్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది నుంచి బాండ్ ఇచ్చిన వారినే అలా అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పారు. గడిచిన మూడేళ్లలో మన దేశం నుంచి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మూడు వేల మంది డాక్టర్లు తిరిగి స్వదేశానికి రాలేదని తెలిపారు.
ఈ ఏడాది నుంచి తమ దేశంలో విద్యాభ్యాసం కోసం నమోదు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా భారత ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాలని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. 2012 నుంచి అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లదలచుకున్న వైద్య విద్యార్థులు కచ్చితంగా బాండ్ ఇవ్వాలని, ఇచ్చినా తిరిగి రాకపోతే వారికి అక్కడ ప్రాక్టీసు చేసేందుకు అనుమతి ఇవ్వొద్దని అమెరికా ప్రభుత్వానికి రాస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన మూడేళ్ల గ్రామీణ వైద్య కోర్సుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) త్వరలోనే అనుమతి ఇస్తుందన్న ఆశాభావాన్ని గులాం నబీ వ్యక్తం చేశారు. అమెరికాలో స్థిర పడాలనుకునే డాక్టర్ల సంగతి ప్రక్కన పెడితే... ఇలా చట్టం చేస్తే మాత్రం భారత్ లో వైద్యుల కొరత కొంతైనా తీరుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more