సియోల్ను నేలమట్టం చేస్తామంటూ ఉత్తర కొరియా తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యూంగ్బక్ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కొరియన్ పీపుల్స్ ఆర్మీను ఉటంకిస్తూ జిన్హువా వార్తాసంస్థ తెలిపింది. ఈ చర్యల్లో భాగంగా తమదైన శైలిలో నిమిషాల వ్యవధిలో సియోల్ను బూడిద చేస్తామని కేపీఏ హెచ్చరించింది. కొరియా ద్వీపకల్పానికి ఏమైనా జరిగితే అందుకు లీయే బాధ్యత వహించాలని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అలాగే కొరియాదేశాల వ్యవహారాల్లో ఏ దేశమైనా తలదూర్చిన పక్షంలో తమ సైన్యం, ప్రజల ప్రతీకారాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more