కేరళ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రా రైతులంటే ఎంతో మక్కువని, అక్కడ తినే ప్రతి గింజ ఆంధ్రా నుంచే వస్తుందని ఆ రాష్ట్రానికే చెందిన వాయలార్ అన్నారు. ప్రజానీకానికి అవసరమైన అన్ని వసతులు అమ్మ సోనియాగాంధీ కల్పిస్తోందని పార్టీ పరిస్ధితులు పరిశీలించడానికి వచ్చిన కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల తాత్కాలిక ఇన్చార్జి వాయలార్ రవి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద కూలీల కోసం గ్రామీణ ఉపాధి హామీ పధకం, మహిళల కోసం రిజర్వేషన్లు, పేద పిల్లల కోసం విద్యాహక్కు చట్టం మాత్రమే కాకుండా ఆహార భద్రత పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన ఘనత సోనియా అమ్మకు దక్కుతుందన్నారు. ఉప ఎన్నికలు జరగనున్న పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో పార్టీ పరిస్థితిని పరిశీలించడానికి వచ్చిన ఆయన కొయ్యలగూడెంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో సోనియా భజనతో తరించిపోయారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా ఎల్లప్పుడూ పేద ప్రజలకు సౌకర్యాలు కల్పించటంపైనే దృష్టి పెడతారన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పేదలకు పని కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఆమే రూపకల్పన చేశారన్నారు. ఇది దేశ చరిత్రలోనే కీలకమైన నిర్ణయమన్నారు. ఇదే సమయంలో మహిళాభ్యున్నతికి సోనియా కట్టుబడి ఉన్నారని, అందువల్లే అన్ని సంస్థల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారన్నారు.
దివంగత ప్రధాని రాజీవ్గాంధీ ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి స్థాయిలో ఆమోదం పొందేలా చేసేందుకు సోనియా కృషి చేస్తున్నారన్నారు. పేదలు, మహిళల తర్వాత పిల్లల కోసం విద్యాహక్కు చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. వీటితోపాటు ఆహారభద్రతా చట్టానికి కూడా సోనియా రూపకల్పన చేశారన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని హైదరాబాద్లో నాయకులతో చర్చించి రావాలని తనను సోనియా ఆదేశించారని, అయితే క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తల మనోభావాలను కూడా తెలుసుకునేందుకే తాను ఈ పర్యటన చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని, ప్రజలు మద్దతు, బలం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more