టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన బిజినెస్ మేనేజర్ అరుణ్ పాండేతో కలిసి ఫిట్నెస్ వ్యాపారంలో అడుగుపెట్టనున్నాడు. వీళ్లిద్దరూ కలిసి రాబోయే అయిదేళ్లలో ఈ వ్యాపారం కోసం 2 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. స్పోర్ట్స్ఫిట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కొత్త కంపెనీ భారత్తో పాటుగా ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం, సింగపూర్, బ్రిటన్ లాంటి విదేశాల్లో కసిలి స్పోర్ట్స్ఫిట్ బ్రాండ్నేమ్తో 200దాకా ఫిట్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. తొలి నాలుగు జిమ్లు వచ్చే మేలో ఏర్పాటవుతాయి.
భారత్లోనే కాకుండా ధోనీకి పెద్ద సంఖ్యలో అభిమానులున్న విదేశాల్లో సైతం ఈ ఫిట్నెస్ చైన్ను ఏర్పాటు చేయాలన్నది మా ఆలోచన’ అని రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రమోటర్ అరుణ్ పాండే చెప్పాడు. ప్రస్తుతం కంపెనీ ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం, సింగపూర్, బ్రిటన్లలో అనువైన స్థలాలను అనే్వషిస్తోంది. రితి స్పోర్ట్స్ ప్రస్తుతం ధోనీకి సంబంధించిన మ్రాండ్ ఎండార్స్మెంట్ వ్యవహారాలను చూస్తున్న విషయం తెలిసిందే. ఈ కొత్త వ్యాపారంలో సుమారు 2వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలన్నది తమ ఆలోచన అని పాండే అంటూ, ఇప్పటికే కొన్ని విదేశీ కంపెనీలు స్పోర్ట్స్ఫిట్ వరల్డ్లో మైనారిటీ వాటాలు తీసుకున్నాయని చెప్పాడు.
అయితే కంపెనీలో మెజారిటీ వాటాలు పాండే, ధోనీ చేతుల్లోనే ఉంటాయి. ఈ ప్రాజెక్టుకోసం నిధులు ఇవ్వడానికి పలు బ్యాంకులు ఆసక్తి చూపిస్తున్నాయని, అంతేకాకుండా పలువురు మదుపరులు కూడా దీనిపట్ల ఆసక్తి చూపిస్తున్నారని పాండే చెప్పాడు. తొలి నాలుగు జిమ్లను గుర్గావ్, ఢిల్లీ, చండీగఢ్, ఫరీదాబాద్లో ఏర్పాటు చేస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more