సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రోజు రోజుకు వ్యతిరేక వర్గం పెరిగిపోతుంది. ఎక్కడ చిన్న అవకాశం దొరికినా కిరణ్ రచ్చకీడ్చాలని చూస్తున్నారు ప్రత్యర్థి వర్గం. గత కొన్ని రోజుల నుండి సీఎం కిరణ్ కి బొత్సకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రి శంకర్రావు చేసిన ఎర్రచందనం ఆరోపణలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తాజాగా బొగ్గు దిగుమతి వ్యవహారంలో చిక్కుకున్నారు. ఎర్రచందనం వ్యవహారంలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని, దానివల్ల ప్రభుత్వ ఖజానా భారీగా నష్టపోయిందని ఆరోపిస్తూ మాజీ మంత్రి పి.శంకర్రావు హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.
తాజాగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దెబ్బకు దెబ్బ తీసేందుకు సిద్ధమవుతున్నారు. తనను లిక్కర్ కేసులో ఏసీబీ ద్వారా ఇరికించేందుకు కిరణ్ చేస్తున్న ప్రయత్నాలతో తల్లడిల్లిపోతున్న బొత్సకు బొగ్గు అంశం వజ్రాయుధంగా మారింది. చాలారోజుల నుంచి ముఖ్యమంత్రి నిర్ణయాలపై ఒక కన్నేసి ఉంచిన బొత్స బొగ్గు దిగుమతిలో 360 కోట్ల కుంభకోణం జరిగిందన్న పత్రాలను అధిష్ఠానానికి పంపినట్లు తెలిసింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి వ్యతిరేక వర్గం విస్తృత స్థాయిలో మీడియాతో పాటు, అన్ని పార్టీలకూ పంపిణీ చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఏది ఏమైనా కిరణ్ దోషిగా తేలితే మాత్రం బొత్స దెబ్బకు కిరణ్ అవుట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more