మద్యం సిండికేట్ల వ్యవహారం చెంచల్గూడ జైలు అధికారులకూ వణుకు పుట్టిస్తున్నది. ఈ వ్యవహారంలో అరెస్టయిన పోలీసు అధికారులకు భద్రత కల్పించటం కారాగార అధికారులకు తలకు మించిన భారంగా పరిణమిస్తున్నది. ఇదే విషయాన్ని వివరిస్తూ చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ కేశవనాయుడు ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్కు లేఖ ఇచ్చారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఇప్పటికే అరెస్టయి తమ జైల్లో ఉన్నవారిని మరో కారాగారానికి తరలించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇకపై అధికారులను ఎవరినైనా అరెస్టు చేస్తే తమ జైలుకు రిమాండ్ కోసం పంపొద్దని విజ్ఞప్తి చేశారు. ఏసీబీ అధికారులు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మద్యం సిండికేట్లపై విస్తృతంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గరిష్ఠ చిల్లర ధర నిబంధనకు పాతరేసిన పలువురు మద్యం వ్యాపారులను అరెస్టు చేశారు.
దీంతోపాటు నెలనెలా మామూళ్లు దండుకుంటూ మద్యం వ్యాపారుల అక్రమాలను చూసీ చూడనట్లు వదిలేసిన ఖమ్మం, కర్నూలు, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పనిచేస్తున్న ఎక్సైజ్, పోలీసు అధికారులను కూడా కటకటాల వెనక్కి పంపారు. ఇలా అరెస్టయిన ఏడుగురు పోలీసు అధికారులు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నారు. కాగా ఈ అధికారులు గతంలో వేర్వేరు కేసుల్లో అరెస్టు చేసిన పలువురు నిందితులు కూడా ఇదే జైల్లో ఉన్నారు. సరిగ్గా ఈ పరిణామమే జైలు అధికార వర్గాలను కలవరానికి గురిచేస్తున్నది. తమను అరెస్టు చేశారన్న కక్షతో జైల్లో ఉన్న నిందితులు మద్యం సిండికేట్ల వ్యవహారంలో అరెస్టయి కారాగారానికి వచ్చిన పోలీసు అధికారులపై ఎక్కడ దాడి చేస్తారోనన్న ఆందోళనకు లోను చేస్తున్నది. ప్రస్తుతం జైల్లో ఉన్న పోలీసు అధికారులకు రక్షణ కల్పించలేమని లేఖలో పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more