యధాలాపంగా మూడు రూపాయలిచ్చి రైల్వే స్టేషన్ కు వెళ్లి ఫ్లాట్ ఫాం టిక్కెట్ ఇవ్వమంటే ఇచ్చే రోజులు పోతున్నాయి. ఇందుకోసం ఇక ఐదు రూపాయలు చెల్లించుకోవాల్సిందే. తాజాగా రైల్వే మంత్రి దినేష్ త్రివేది పార్లమెంట్ లో కొద్ది సేపటి క్రితం వచ్చే ఏడాదికి రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 10 ఏళ్ల కాలంలో సాధారణ ప్రయాణీకుల టిక్కెట్ ధర పెంచనప్పటికీ..ఈ తాజా బడ్జెట్ లో ఆ మోతా తప్పలేదు.తాజా రైల్వే బడ్జెట్లో రైలు ప్రయాణికుల చార్జీలను కేంద్రం స్వల్పంగా పెంచింది. కిలోమీటరుకు ఏసీ ఫస్టక్లాస్ 30 పైసలు, సెకండ్ క్లాస్ 15 పైసలు పెంచారు. లోకస్, సబర్బన్ రైళ్లలో కి.మీకు 2 పైసలు చొప్పున చార్జీలు పెరిగాయి. దీనిపై అప్పుడే విపక్షాలు గళ్లు మంటున్నాయి.నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.
రైల్వే భద్రతకు రూ. 16842 కోట్లు కేటాయింపు
ప్రమాదాలు జరగకుండా భద్రతే రైల్వే ప్రధాన లక్ష్యం
ఇండిపెండెంట్ రైల్వే సేఫ్టీ అధార్టీ ఏర్పాటు
నవీకరణ లేకుండా భద్రతా చర్యలు సాధ్యం కావు
వచ్చే అయిదేళ్లలో కాపలా లేని రైల్వే గేట్లు తొలగింపు
సామాన్యుడికి మేలు జరిగేలా బడ్జెట్ రూపుకల్పన
ఇండియన్ రైల్వేను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళతాం
రైల్వే భద్రతా చర్యలకు అగ్రతాంబూలం
అనిల్ కకోద్కర్ కమిటీ సిఫార్సులను పాటిస్తాం
ప్రమాదాల నివారణకు శాయశక్తులా కృషి
రైల్వే భద్రత మరింత పెరగాలి
ప్రమాదాల సంఖ్యను తగ్గించాం...ఇంకా తగ్గించాలి
అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు భద్రత
రైల్వే భద్రతకు నిధుల కొరత
రైల్వేల ఆధునీకరణకు రూ.75వేల కోట్లు ప్రభుత్వం సమకూర్చనుంది
నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు
నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు
శ్యాం పిట్రోడా కమిటీ సిఫార్సుల అమలుకు నిర్ణయం
సరిహద్దుల్లో రైల్వే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం
బడ్జెట్ లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట
పెండింగ్ లో ప్రస్తుతం 487 రైల్వే ప్రాజెక్టులు
బడ్జెట్ అంటే లెక్కల పత్రం కాదు
వనరుల మేరకే నిధుల కేటాయింపు
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more