ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడంతో ప్రజలపై మరోసారి ‘పెట్రో బాంబు’ పడటం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా పెట్రోలు ధరలు పెంచడాన్ని ప్రభుత్వం వాయిదావేస్తూ వచ్చిన నేపథ్యంలో ‘మినీ జనరల్ ఎన్నికలు’గా భావించిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోలు ధరను లీటరుకు 5 రూపాయలకు పైగా పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.
అయితే, పెంపు అనేది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ‘మేము పెట్రోలుపై లీటరుకు 5 రూపాయల 10 పైసలు నష్టపోతున్నాం’ అని ఓ చమురు కంపెనీ ఉన్నతాధికారి చెప్పారు. అయిదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసినందున ధరల సవరణకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్కు 109 డాలర్లు ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇండియన్ ఆయిల్ , బిపిసిఎల్, హెచ్పిసిఎల్లు పెట్రోలు ధరలను పెంచాయి. తర్వాత ఇప్పటివరకు ధరల్లో మార్పు చేయలేదు. కాగా, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్కు 130.71 డాలర్లకు చేరుకుంది. ఏవిధంగా చూసినా పెట్రోలు ధరలు పెరగడం తప్పనిసరని. అయితే ఎంతమేరకు పెంచాలన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉందని ఆ అధికారి చెప్పారు.
యుపి సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన విధంగా ఫలితాలు లభించక పోవడంతో ఈనెల 12న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే పెట్రోలు ధరలు పెంచడానికి యుపిఏ ప్రభుత్వం చమురు కంపెనీలకు అనుమతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్, వంటగ్యాస్ ధరలను కూడా పెంచాలని చమురు కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తృణమూల్ కాంగ్రెస్, డిఎంకెలాంటి కాంగ్రెస్ మిత్రపక్షాలకు కూడా ప్రాతినిధ్యం ఉన్న మంత్రుల సాధికారిక కమిటీ దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ రెండు పార్టీలు కూడా డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచడానికి అంగీకరించని విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more