పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో కలిపి చాన్నాళ్లయినా ఇంత వరకు చిరు వర్గానికి వచ్చిన లాభం ఏం లేదు. అదే చిరు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఆపదలో ఉన్న కాంగ్రెస్ ను ఆదుకున్నాడు. పార్టీ విలీనం అప్పడు కాంగ్రెస్ ఇచ్చిన మాట ఇంత వరకు నేరవేర్చలేదు. అదీ కాంకుండా పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. మొన్న అవిశ్వాసం సమయంలో అదను చూసి చిరుకొట్టిన దెబ్బకు కాంగ్రెస్ అధిష్టానం కదిలినట్లు ఉంది. త్వరలోనే స్వతంత్ర హోదాలో కేంద్రంలో మంత్రి పదవిని కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు ఉంది.
తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెసు పార్టీ అధిష్టాం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అవిశ్వాసం సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టిన చిరంజీవి, ఆయన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఆయనకు పాలనలో అనుభవం లేనందున ప్రస్తుతానికి స్వతంత్ర హోదాలో సహాయ మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఆపదలో పార్టీని కాపాడిన చిరు, ఆయన వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అంశంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ గులాం నబీ ఆజాద్తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
అయితే చిరంజీవికి కేంద్రంలో ఏ పదవి ఇస్తారనే దాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీని పై ఇప్పడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మన రాష్ట్రంలో అమలు చేసే పథకాలకు సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డికి ఓ సలహా ఇచ్చాడు. దానికి సీఎం కిరణ్ కుమార్ కూడా అంగీకరించి ఆ పేరునే పెట్టారు. ఆ సభలో సీఎం చిరంజీవి సలహాలు ఇక పై ప్రవేశపెట్టే పథకాల విషయంలో తీసుకుంటామని చెప్పారు.
యితే కేంద్రం ప్రవేశ పెట్టే పథకాలకు కూడా చిరుని ఉపయోగించుకోవాలని, చిరు మంచి మంచి సలహాలు ఇస్తాడని సీఎం సోనియాతో చెప్పారని, దీంతో ఆమె కేంద్రంలో ప్రవేశ పెట్టే పథకాలకు సహాయ మంత్రిగా నియమించాలని అనుకుంటున్నారట. సో... చిరంజీవికి కేంద్రంలో దక్కే పదవి ‘‘కేంద్రపథకాల సహాయ మంత్రి’’ అని అందరు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more