Cbi jd lakshimi narayana visit thirumala thirupathi

Cbi Officer Jd Lakshminarayana.gif

Posted: 12/07/2011 02:28 PM IST
Cbi jd lakshimi narayana visit thirumala thirupathi

cbi-jd-lakshimi-narayanaరాష్టంలోని అవినీతి పరులు ఆట కట్టిస్తున్న సీబిఐ జేడీ లక్ష్మినారాయణకు గత కొన్ని రోజుల నుండి క్షణం తీరిక దొరకడం లేదు. ఎప్పుడు అవినీతి అక్రమాలు తవ్వి తీయడానికే సమయం సరిపోవడం లేదు. అలాంటి జేడీ లక్ష్మినారాయణ కాస్త తీరిక చేసుకొని కలియుగదైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమల వచ్చారు. ఉదయం తిరుమల చేరుకున్న ఆయన, కుటుంబ సభ్యులు శ్రీవారి పాదాలు, శిలాతోరణం, పాపవినాశనం, జాపాలి, వేణుగోపాల స్వామి తదితర ఆలయ ప్రాంతాలను సందర్శించారు. రాత్రి స్వామి వారిని విశ్రాంతి సమయంలో దర్శించుకున్నారు.

అయితే తన కుమారుడికి పరీక్షలు ఉండటంతో దేవుడి దర్శనానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలను సున్నితంగా తిరస్కరించారు. మీరు దేవుడిని ఏం కోరుకున్నారంటే.. తమకు శక్తినివ్వమని దేవుడిని ప్రార్థించామన్నారు.ఇన్ని రోజులను అవినీతి పరుల భరతం పడుతున్న జేడీకి కాస్త శక్తి తగ్గడంతో శ్రీవారిని శక్తి ప్రసాదించమని కోరుకున్నాడని, దేవుడు ప్రసాదించిన శక్తితో ఇక పై జగన్ లాంటి అక్రమార్కుల ఆటను కట్టించడంలో వేగం పెంచుతాడని అనుకుంటున్నారు. మరి ఏ మేరకు శ్రీవారి శక్తి పని చేస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister sridhar babu comments at jagan tdptrs parties
Sonia not to celebrate her birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles