సఫారీ గడ్డపై ఈ ఏడాది ప్రారంభంలో పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టు అక్కడ.. అరుదైన రికార్డును నెలకొల్పి సగర్వంగా స్వదేశానికి చేరిన విషయం తెలిసిందే. అయితే అంతకన్నా ముఖ్యమైనదేమంటే.. మన క్రికెటర్లు అందరూ సురక్షితంగా భారత గడ్డపై కాలు మోపారు. అదేంటి.? అలా అంటున్నారు అంటారా.? నిజమేనండీ.. అలాంటిదే ఓ ఘటన రోహిత్, రహేనేల ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. దీంతో వారు.. వామ్మో.. రవీంద్ర జడేజాతో కలిసి ఎక్కడికీ వెళ్లకూడదు అని కూడా నిర్ణయించుకున్నారట.
తమకు ఎదురైన అనుభవాన్ని వారు పేర్కొంటూ.. భయానక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. అసలేం జరిగిందంటే... దక్షిణాఫ్రికా పర్యటనలో మ్యాచులకు మధ్యలో కాస్త విరామం లభించడంతో రోహిత్ శర్మ-రితిక, రహానె-రాధిక, జడేజా కలిసి అడవికి వెళ్లారు. ఆ సమయంలో చోటు చేసుకున్న ఓ సన్నివేశాన్ని రోహిత్, రహానె పంచుకున్నారు. ‘అందరం కలిసి ఆ అడవిలో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో రెండు చిరుతలు అటుగా వచ్చాయి. మాకు అత్యంత సమీపంలో ఉన్నాయి ఆ రెండు. మేమంతా షాక్కు గురై సైలెంట్గా వాటిని చూస్తున్నాం.
ఇంతలో జడేజా ఏదో శబ్దం చేస్తూ వాటిని పిలవడం మొదలుపెట్టాడు. ఇంకేముంది ఆ రెండు చిరుతలు వెనక్కి తిరిగి మమ్మల్ని చూశాయి. దేవుడా అయిపోయాం అని అనుకున్నాం. జడేజాపై అందరికీ చాలా కోపం వచ్చింది. ‘ఏం చేస్తున్నావు? మనం అడవిలో ఉన్నాం. అవి మనల్ని చూస్తే.. వాటికి ఆహారం అయిపోతాం అని ఆగ్రహం వ్యక్తం చేశాం. కాసేపటికి చిరుతలు అటు- ఇటు చూసుకుంటూ మాకు దూరంగా వెళ్లిపోయాయి. దీంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు. జడేజాతో మాత్రం ఇక ఎప్పుడూ... ఎక్కడికీ వెళ్లకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాం’ అని రోహిత్, రహానె తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more