భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి అరుదైన అవకాశం దక్కింది. అండర్-19 ప్రపంచకప్ పోటీలలో ఆయన కామెంటేటర్ గా ఎంపికయ్యారు. ఈ నెల 13 నుంచి న్యూజిలాండ్ వేదికగా అండర్-19 ప్రపంచకప్ టార్నోమెంటు జరగనుంది. ఈ టోర్నీకి కామెంటేటర్ బాధ్యతలు నిర్వహించే వారి జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. 14మందితో కూడిన జాబితాలో భారత్ కు చెందిన మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, అంజుమ్ చోప్రా చోటు దక్కించుకున్నారు.
ఇప్పటికే కామెంటేర్లుగా బాద్యతులు నిర్వహిస్తున్న గంగూలీ, అంజుమ్ చోప్రాలతో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న టోర్నీ ఫిబ్రవరి 3తో ముగియనుంది. పృథ్వీ షా నాయకత్వంలోని భారత జట్టు ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది. రెండు రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కాగా ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ టార్నమెంటులో కామెంటేటర్ గా ఎంపికైన సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. తాను ఈ ఈవెంట్ లో పాల్గోంటున్నందుకు చాలా సంతోషంగా వుందని అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా రాబోతున్న భవిష్యత్ టాలెంట్ ను దగ్గర్నుంచి చేసేందుకు తనకు ఈ ఎంపిక దోహదపడుతుందన్నాడు. ఈ ఈవెంట్ లో అన్ని దేశాలకు చెందిన అప్ కమింగ్ టాలెంట్ ను వీక్షించే ఏకైక వేదికగా కొనియాడారు.
కామెంటరీ ప్యానెల్లో చోటు దక్కించుకున్న వారు:
* సౌరభ్ గంగూలీ(ఇండియా)
* అంజుమ్ చోప్రా(ఇండియా)
* టామ్ మూడీ (ఆస్ట్రేలియా)
* ఇయాన్ బిషప్(వెస్టిండీస్)
* సైమన్ డౌల్(న్యూజిలాండ్)
* డానీ మారిసన్(న్యూజిలాండ్)
*హెచ్డీ అకర్మన్(దక్షిణాఫ్రికా)
*రాబ్ కీ(ఇంగ్లాండ్)
* నిక్ నైట్(ఇంగ్లాండ్)
* మార్క్ బుచర్(ఇంగ్లాండ్)
* గ్రాంట్ ఇలియాట్(న్యూజిలాండ్)
* క్రిస్ హారిస్(న్యూజిలాండ్)
* రసూల్ ఆర్నాల్డ్(శ్రీలంక)
* అలాన్ విలకిన్స్(ఇంగ్లాండ్)
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more