భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీపై క్రికెట్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే.. జంబోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపకపోవడమే. కోహ్లీతో మనస్పర్థల కారణంగానే కుంబ్లే ఈ ఏడాది జూన్లో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ పై అభిమానులు మరీ ముఖ్యంగా నెట్ జనులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. కోహ్లీ చేయకూడని తప్పులు చేస్తున్నావ్ అంటూ మందలించే విధంగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మంగళవారం 47వ పుట్టిన రోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్, పుజారా, రహానె, ఇషాంత్ శర్మతో పాటు ఎంతో మంది క్రికెటర్లు జంబోకు సోషల్మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒక్క విరాట్ కోహ్లీ తప్ప. దీంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ‘గత ఏడాది ఇదే రోజు విషెస్ చెప్పిన కోహ్లీకి ఈ ఏడాది ఏమైంది’ అంటూ పలువురు ప్రశ్నించారు.
‘కోహ్లీకి గాయకుడు అర్జిత్ సింగ్ను అభినందించేందుకు సమయం ఉంది కానీ జంబోకి బర్త్డే విషెస్ చెప్పేందుకు టైం లేదు’... ‘టీవీ షోలో పాల్గొనేందుకూ, ఫుట్బాల్ మ్యాచ్ ఆడేందుకూ వీలు కుదిరింది.. కుంబ్లేకు విషెస్ చెప్పడమే కుదరలేదు’... ‘అనిల్ భాయ్కి కోహ్లీ విషెస్చెప్పకపోవడం చాలా బాధ కలిగించింది’... ‘నువ్వెందుకు కుంబ్లేని విష్ చేయలేదు.. కోహ్లీ నీ అహాన్ని కాస్త పక్కన పెట్టు’... ‘జంబో బర్త్ డేకి అందరూ విష్ చేశారు.. ఒక్క కోహ్లీ తప్ప, కుంబ్లేను విష్ చేసేందుకు కోహ్లీకి అహం అడ్డొచ్చింది’... ఇలా అభిమానులు తమకు నచ్చిన రీతిలో కోహ్లీ తీరుపై స్పందించారు. లెజెండరీ స్పిన్నర్ కుంబ్లేపై తమకున్న అభిమానాన్ని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more