జింబాబ్వేపై అస్ట్రేలియా మ్యాచ్ లో గ్లెన్ మక్ గ్రాత్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో కనిపించిన ఫిల్డిండ్ మళ్లీ ఇన్నాళ్లు కనిపించింది. అదీ రంజీ ట్రోఫీలో మ్యాచ్ లో. ఈ ఫోటోను పరిశీలిస్తే అర్థమవుతుంది కదూ. రంజీ మ్యాచ్ లో భాగంగా నిన్న జరిగిన ఓ మ్యాచులో ఫీల్డర్లందరూ స్లిప్లోనే నిల్చుని బాధ్యతలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్-ఛత్తీస్ గఢ్ ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఇలాంటి సన్నివేశం మళ్లీ కనిపించింది.
ఈ మ్యాచ్లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. తొమ్మిది మంది ఫీల్డర్లు స్లిప్లోనే నిల్చుని ఫీల్డింగ్ నిర్వహించడం ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోను షమి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బెంగాల్ బౌలర్లు మహమ్మద్ షమి, అశోక్ దిండా.. బ్యాట్స్మెన్కు పరుగులు దక్కకుండా కట్టడి చేసేందుకు తొమ్మిది మంది ఫీల్డర్ల చేత స్లిప్లోనే ఫీల్డింగ్ చేయించారు. ఛత్తీస్గఢ్ రెండో ఇన్నింగ్స్లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానుల్ని అలరిస్తోంది.
బెంగాల్ తన తొలి ఇన్నింగ్స్ ను 529/7 వద్ద డిక్లేర్ చేసింది. దిండా ధాటికి ఛత్తీస్గఢ్ తన తొలి ఇన్నింగ్స్ లో కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో షమి దాటికి 259 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగాల్ ఇన్నింగ్స్ 160 పరుగుల తేడాతో విజయం సాధించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more