స్వదేశంలో జరుగుతున్న సిరీస్ లలో వరుస విజయాలను అందుకున్న టీమిండియా.. అదే జోరును జోష్ ను కనబర్చేలా.. అదే జట్టును కంగారులపైకి కూడా ప్రయోగించనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అసీస్ తోనూ విజయాన్ని నమోదు చేసేలా.. జట్టులో పెద్దగా మార్పులు లేకుండానే తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరస్ లో భాగంగా తొలి రెండు టెస్టులకు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్టర్లు ఇవాళ ప్రకటించారు.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు కరుణ్ నాయర్ ను తిరిగి జట్టులో్కి ఎంపిక చేయగా, కుల్ దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్ లకు చోటు కల్పించారు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన చివరి టెస్టు లో ట్రిపుల్ సెంచరీతో ఆకట్టుకున్న కరుణ్ నాయర్ పై నమ్మకం ఉంచిన సెలక్టర్లు అతని ఎంపికపై మరోసారి మొగ్గు చూపారు. బంగ్లాదేశ్ తో టెస్టుకు నాయర్ ను ఎంపిక చేయకపోయినా, ఆస్ట్రేలియాతో కీలక సిరీస్ లో నాయర్ కు చోటు కల్పించారు.
ఇదిలా ఉంచితే బంగ్లాదేశ్ తో టెస్టుకు కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్ లను ఎంపిక చేసినా, తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఐదున్నరేళ్ల క్రితం భారత్ తరఫున తన చివరి టెస్టు ఆడిన తమిళనాడు బ్యాట్స్మన్ ముకుంద్కు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు లభించింది. మరొకవైపు కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఆడే అవకాశం రాని కుల్దీప్.. ఆస్ట్రేలియాతో సిరీస్ లో అతను అరంగేట్రం చేసే అవకాశాలు కనబడతున్నాయి.ఈ నెల 23వ తేదీన ఆస్ట్రేలియాతో పుణెలో జరిగే తొలి టెస్టుతో నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది.
తొలి రెండు టెస్టులకు భారత జట్టు:
విరాట్ కోహ్లి(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చటేశ్వర పూజారా, అజింక్యా రహానే, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్, హార్దిక్ పాండ్యా
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more