భారత్తో సిరీస్కు ముందు ఎగిరిపడిన ఇంగ్లాండ్ బాటలోనే ప్రస్తుతం అస్ట్రేలియా కూడా పయినిస్తుంది. విరాట్ సహనాన్ని మేం పరీక్షిస్తామంటూ.. ఆతడి అటను చూస్తామంటూ ఆస్ట్రేలియా మైండ్ గేమ్ మొదలెట్టేసింది. ప్రస్తుతం పాకిస్తాన్తో మూడు టెస్టుల సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా..వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్ లో పర్యటనపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని టార్గెట్ చేస్తూ మాటల యుద్దానికి దిగాడు. భారత్ తో జరిగే నాలుగు టెస్టు సిరీస్లో విరాట్ 'ఆట'ను తాము చూడాలనుకుంటున్నట్లు స్మిత్ వ్యాఖ్యానించాడు.
'విరాట్ వరల్డ్ క్లాస్ ఆటగాడు. విరాట్ కోహ్లి దూకుడుతో భారత్ జట్టు గత 18 నెలలుగా తన జైత్రయాత్ర సాగిస్తోంది. భారత్లో వారు ఇప్పటికే చాలా క్రికెట్ ఆడారు. ఆ క్రమంలోనే విరాట్ బాడీ లాంగ్వేజ్ కూడా బాగా మెరుగుపడి ఉంటుంది. విరాట్ ను తొందరగా పెవిలియన్ కు పంపడమే మా లక్ష్యం. మాపై విరాట్ ఎంతవరకూ రాణిస్తాడో చూస్తాం. మాతో సిరీస్ లో విరాట్ సహనాన్ని పరీక్షిస్తాం' అని స్మిత్ వ్యాఖ్యానించాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విదేశీ పర్యటనకు వెళ్లే ముందు మాటల యుద్ధానికి దిగడం కొత్తేమీ కాదు. ప్రత్యర్థి ఆటగాళ్లను మాటలతో బలహీనపరిచి మానసికంగా పైచేయి సాధించడం ఆసీస్ గేమ్ ప్లాన్లో భాగం. దీనిలో భాగంగా విరాట్ సేన పై స్మిత్ మైండ్ గేమ్ ను ఆరంభించాడని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఆరంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్లో విరాట్ ను కట్టడి చేసి భారత్ పై పైచేయి సాధించాలని ఆసీస్ ముందుగానే ప్రణాళిక రచిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more