ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ సునాయాస విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రభాగన నిలిచిన గుజరాత్ డెన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ గర్జించింది. ఫలితంగా ఎనమిది వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 150 పరుగుల విజయలక్ష్యంతో అనంతరం బ్యాటింగ్ బరిలోకి దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ రెండు వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లకు 16 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.
ఓపెనర్లు డి కాక్, రిషబ్ పాంత్ ఆట ప్రారంభం నుంచే రెచ్చిపోయి ఆడారు. ఓ వైపు వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడుతూనే ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ను పరుగులు పెట్టించారు. ఇరువురు బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ మంచి భాగస్వామ్యాన్ని కనబర్చారు. అర్ధ శతకం చేసి మరింత దూకుడు పెంచుతున్న క్రమంలో రిషబ్ పాంత్ 13వ ఓవర్లో జడేజా బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్కు చేరాడు.
అనంతరం సంజు స్యామ్సన్తో కలిసి డికాక్ స్కోర్ను మరింత ముందుకు తీసుకెళుతూ 46 పరుగులతో ఆఫ్ సెంచరీకి చేరువలో ఉండగా డ్వెయిన్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డుమిని స్యామ్సన్కు చక్కని జోడిగా నిలిచాడు. ఇరువురు సిక్సర్, ఫోర్లతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరానికి చేర్చారు. డి కాక్ 46(45), రిషబ్ పాంత్ 69(40), సంజు స్యామ్సన్ 19(13 నాటౌట్), డుమిని 13(7 నాటౌట్) పరుగులు చేశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 150 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ ఆదిలోనే బ్రెండన్ మెకల్లమ్(1), డ్వేన్ స్మిత్(15) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.అనంతరం ఆరోన్ ఫించ్(5) కూడా నిష్రమించడంతో గుజరాత్ 24 పరుగుల వద్ద మూడో వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలోసురేష్ రైనా-దినేష్ కార్తీక్ జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడీ 51 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన అనంతరం రైనా(24) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు.
అయితే దినేష్ కార్తీక్(53;43 బంతుల్లో 5 ఫోర్లు) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో గుజరాత్ తేరుకుంది. ఆపై రవీంద్ర జడేజా(36 నాటౌట్; 26 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్) రాణించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నదీమ్ కు రెండు వికెట్లు సాధించగా, క్రిస్ మోరిస్,జహీర్ ఖాన్, మహ్మద్ షమీ, అమిత్ మిశ్రాలు తలో వికెట్ తీశారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more