కుమార భీమారామము
పంచరామాల్లో చివరిదైన ఈ క్షేత్రం.. రాజమండ్రి కి 47 కి. మీ. దూరంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం తాలూకా, సామర్లకోట రైల్వే స్టేషన్ కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్వామి వారిని ‘కాల భైరవుడ’ని పిలుస్తారు. ఇక్కడ సున్నపురాయితో తయారుచేయబడ్డ లింగం 60 అడుగుల ఎత్తులో ఉండి రెండంతస్తుల మండపంగా ఉంటుంది. ఈ లింగాన్ని కుమార స్వామి ప్రతిష్టించాడు.