క్షీరారామము
పంచరామాల్లో మూడోదైన క్షీరారామం.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. ఇక్కడ స్వామివారు ‘రామలింగేశ్వర స్వామి’గా పూజలు అందుకుంటున్నాడు. ఈ క్షేత్రంలో ఉన్న లింగాన్ని స్వయాన శ్రీరాముడు ప్రతిష్టించాడని కొందరి వాదన. ఈ ఆలయానికి ఒక విశేషం ఉంది. అదేమిటంటే.. ఆలయం 9 అంతస్తులలో ఉండి, రాజగోపురం 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. తెల్లగా ఉండే శివలింగం రెండున్నర అడుగుల ఎత్తులో ఉంటుంది.