మహబూబ్ నగర్ జిల్లా బస్సు ప్రమాదంలో అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. బస్సులో దీపావళికి ఉపయోగించే బాణాసంచా, జట్టు ఉందని సమాచారం. అందుకే ప్రమాద తీవ్రత అధికంగా ఉందని సమాచారం. డీజీల్ ట్యాంకు పేలడం వల్లే ఇంత ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఒక్క డీజిల్ ట్యాంకర్ పేలడం వల్ల కాదు..అగ్గిని మరింత రెచ్చగొట్టే వస్తువులు బస్సులో ఉన్నాయని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొంటున్నట్లు సమాచారం. ప్రమాదం ఎలా జరిగిందో..చూద్దాం..
ఎ: ప్రాణాలతో బయటపడ్డ వారు బెంగళూరులో కాకుండా మార్గమధ్యంలో ఎక్కారు. వీరంతా పూర్తిగా నిద్రలోకి జారుకోలేదు. వీరు ప్రమాదం నుండి తప్పించుకున్నారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణీకులు మంటలు అంటుకున్న తరువాత లేచి పరుగెత్తారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
బి : మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద ప్రయాణిస్తున్న బబ్బార్ ట్రావెల్స్ కు చెందిన ఓల్వో బస్సు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఒక్కసారిగా టైర్ పేలింది.
సి : అదుపు తప్పి వేగంగా వెళ్లి కల్వర్టును ఢీకొంది. గోడను చాలా బలంగా తాకుతూ ముందుకెళ్లింది. దీనితో బస్సంతా ఒక్కసారిగా కుదుపుకు గురైంది. ముఖ్యమైన బోల్టులు ఊడిపోయాయి.
డి: బస్సు కుదుపులకు మెయిన్ డోర్ గొట్టం విరిగి లాక్ అయ్యింది.
ఇ : ఒక్కసారిగా డీజిల్ ట్యాంక్ పేలింది.
ఎఫ్ : కల్వర్టును ఢీకొన్న ప్రాంతం నుండి డీజిల్ లీక్ అవుతూ వచ్చింది. స్టీరింగ్ వైర్లు తెగిపోయాయి.
జీ : వంద అడుగుల వరకు దూసుకెళ్లిన బస్సులో మంటలు చెలరేగాయి.
హెచ్ : మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా ప్రయాణీకులు రక్షించుకుందామని బస్సు ముందు భాగంలోకి వచ్చారు. డోర్ లాక్ అవడంతో మళ్లీ వెనక్కి వెళ్లారు. అక్కడ మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. అందులోనే కాలి బూడిదయ్యారు. ఐ: బస్సులో మూడు సంచులా నిండా జట్టును తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే మంటల తీవ్రతను పెంచింది.
జే: అంతేగాకుండా దీపావళి పండుగకు ఉపయోగించే మందుగుండు సామాగ్రి కూడా బస్సులో ఉన్నట్లు సమాచారం. ఇవి కూడా పేలడంతో ప్రమాదం భారీగా జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.
కె : మంటలు చెలరేగితే అదుపు చేసే సేఫ్టీ సిలిండర్ ఎగిరి పడిపోయింది. ఇది పనిచేయకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more