హైదరాబాద్ ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించినది కాదని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిదీ అని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మరోసారి నిరసన గళం వినిపించారు. కిరణ్ మాట్లాడుతూ ఒక సమస్యను పరిష్కరించడానికి మరో పెద్ద సమస్యను సృష్టించరాదని అన్నారు. పార్టీ కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనల్ని పరిష్కరించనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముందుకెళ్లడం చాలా కష్టమని కిరణ్ అన్నారు. తెలంగాణపై నోట్ ను కేంద్ర కేబినెట్ ముందు చర్చకు పెట్టిన తర్వాత అసెంబ్లీ ఆమోదం కోసం పంపుతామన్న కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనపై పైవిధంగా స్పందించారు. తెలంగాణ ప్రకటన వెలువడ్డాక కాంగ్రెస్, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్ననిరసనల గురించి కిరణ్ ప్రస్తావించారు. కాంగ్రెస్ తో ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తారా అన్న ప్రశ్నకు.. 'పార్టీ వ్యతిరేక వైఖరికి సంబంధించిన విషయం కాదిది. ప్రజల భయాందోళనలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. లక్షలాది ప్రజలు తమ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంది' అని కిరణ్ బదులిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం గురించే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నారన్నారు. పార్టీ కంటే రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. విభజన వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 53 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాదంటే ఎలా? హైదరాబాద్ మాదని ఎవరూ చెప్పరాదు. హైదరాబాద్ సుదీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది' అని ముఖ్యమంత్రి అన్నారు.
నాగం ఫైర్
సమైక్యాంధ్రా కోసం చివరి వరకూ పోరాడతామన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై నాగం జనార్ధన రెడ్డి మండిపడ్డారు. సీఎం పదవిలో ఉండటానికే అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణపై ఎటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా నాగం మాట్లాడుతున్నారన్నారు. ఈ నెల 28 తేదీన మహబూబ్ నగర్ లో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత నాగం జనార్ధనరెడ్డి తెలిపారు. ఈ సభను బీజీపీ జాతీయ నాయకురాలు సుష్మా స్వరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, విభజనతోనే రెండు ప్రాంతాలవారికి సమన్యాయం జరుగుతుందని బీజేపీ నేత, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి గతంలొ స్పష్టంచేశారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more