భాగ్యనగరంలో బాలల డాక్యుమెంటరీ చిత్రోత్సవ సందడి షురూ కానుంది. హైటెక్ సిటీ వద్దగల శిల్పకళావేదికలో నవంబర్ 5 నుంచి 7వరకు హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ జరగనుంది. ప్రముఖ దర్శకులు వైశాలిబిస్త్ థియేటర్ వర్క్ షాప్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ముంబై, చెనై, బెంగళూరులకు చెందిన ప్రఖ్యాత రంగస్థల సంస్థలు పాల్గొంటున్నాయి. 2న టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కా ర్యదర్శి చందనాఖన్, సినీ నటుడు దగ్గుబాటి రానా, దర్శకుడు జాగర్లమూడి క్రిష్ లోగోను ప్రారంభించనున్నారు. దీనికి అందరూ ఆహ్వానితులే.
టికెట్ల కోసం: ప్రదర్శనకు హాజరు కావాలనుకునేవారు టికెట్లను బుక్ మై షో ద్వారా పొంద వచ్చు. టికెట్ ధర రూ.125లు. వివరాలకు ఫోన్: 88858 93587.
నవంబర్ 5: ‘లాల్ పెన్సిల్’:
భాష: హిందీ, ప్రదర్శకులు: అరణ్య థియేటర్ గ్రూప్, ముంబై, ఇతి వృత్తం: కొరియన్ నవల ఆధారంగా దీన్ని రూపొందించారు. ఓ సామాన్య చిన్నారి తన సహ విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య నడిచే కథ. మాములు వి ద్యార్థిని ఎలా స్టార్ అయ్యింది అనేది నాటకం ఇతివృత్తం. సమయం: సాయంత్రం 6.30 గంటలకు.
నవంబర్ 6: మంకీ బిజినెస్: భాష: ఇంగ్లీషు, ప్రదర్శకులు: థియేటర్ నిషా ఎసెంబుల్ ప్రొడక్షన్, చెన్నై. ఇతి వృత్తం: కరాడి టేల్స్ ని రంగస్థలంపై ప్రదర్శించనున్నారు. అరణ్యంలో మనుషులు, వింత చేష్టలతో అలరించే కోతుల కథ ఇది. సమయం: సా॥6.30.
నవంబర్ 7: అతిథి అండ్ ఫ్రెండ్స్: భాష: ఇంగ్లీషు, కన్నడ, ప్రదర్శకులు: రఫికీ, బెంగళూరు
ఇతి వృత్తం: అతిథి తన స్నేహితుల సాహసాల గాథ ఇది. షాడో పప్పెటరీ, మాస్క్లు, సంగీతం సమ్మిళనంగా ప్రదర్శించనే ఈ నాటకం ఆసక్తి కరంగా సాగుతుంది. సమయం: సాయంత్రం 6.30
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more