హుస్సేన్సాగర్ నీటిని శుద్ధిచేసి.. వివిధ సంస్థలకు సరఫరా చేసే విధానంపై హెచ్ఎండీఏ దృష్టి సారించింది. సాగర్ లోతట్టు ప్రాంతాల్లోకి నేరుగా నీరు ప్రవహించేలా నిజాం కాలంలో ఏర్పాటు చేసిన పైప్లైన్ వ్యవస్థను ప్రక్షాళన చేయడం ద్వారా చర్యలు చేపట్టనుంది. మూడు ఔట్ఫ్లో నెట్వర్క్ ల ద్వారా సరఫరా అవుతున్న మూడు మిలియన్ గ్యాలెన్ల నీటికి ఖరీదు కట్టనున్నారు. ఈ పథకంలో భాగంగా కాలం చెల్లిన పైపులు.. నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఈ పనులను నిర్వహించాల్సిందిగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ను హెచ్ఎండీఏ కోరింది. ఈ మేరకు అవసరమైన విధివిధానాలను సూచించాల్సిందిగా ఓ కన్సల్టెంట్ను నియమించడానికి గ్రేటర్ టెండర్లు పిలిచింది. సాగర్ నీటిని లోతట్టు ప్రాంతాల్లోకి సరఫరా చేయడానికి సంబంధించిన డిజైన్లను అందించడానికి రెండు సంస్థలు ఆసక్తి చూపాయి. అర్హత ఉన్న ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించనుంది. మొత్తం ప్రాజెక్టును సుమారు రూ. మూడు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. నిధులను మాత్రం సాగర్ ప్రక్షాళనలో భాగంగా హెచ్ఎండీఏనే అందించనుంది.సాగర్ నీరు లోతట్టు ప్రాంతాలకు సక్రమంగా చేరడం లేదు. ప్రక్షాళన పనులను చేపట్టిన హెచ్ఎండీఏ.. సాగర్ నీరు లోతట్టు ప్రాంతాలకు సవ్యంగా సరఫరా అయ్యేలా చూడాల్సిన బాధ్యతను జీహెచ్ఎంసీకి అప్పగించింది. సరఫరా వ్యవస్థ, పైప్లైన్ల పరిస్థితి, పేరుకుపోయిన పూడిక తదితన విషయాలను పరిశీలించడానికి గ్రేటర్ వారం రోజుల్లో ఓ క న్సల్టెంట్ను నియమించనుంది. నీటి సరఫరా నెట్వర్క్ మొత్తాన్ని పరిశీలించి దానిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించడం ఈ కన్సల్టెంట్ బాధ్యత. ఇది పూర్తయిన తర్వాత శుద్ధి చేసిన నీటి సరఫరాకు మరింత ఎక్కువ మొత్తం వసూలు చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) సహకారంతో హుస్సేన్సాగర్ చెరువు, దాని పరీవాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును హెచ్ఎండీఏ చేపట్టింది. ఇది ఈ సంవత్సరం మార్చినాటికి పూర్తికావచ్చని అంచనా.మూడు మార్గాలపై నజర్ ... హుస్సేన్సాగర్ నుంచి మూడు ఔట్ఫ్లో నెట్వర్కులున్నాయి. సాగర్ నీటిని వివిధ సంస్థ లు, పార్కులు, పరిశ్రమలు కొన్ని దశాబ్దాలుగా వివిధ అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. కొన్ని సంస్థలు హెచ్ఎండీఏకు నామమాత్రపు ఫీజులను చెల్లిస్తుండగా, మరి కొన్ని ఉచితంగా వాడుకుంటున్నాయి.నెట్వర్క్ లు ఇవీ.. నీటి సరఫరా నెట్వర్కులలో ఒకటి ట్యాంక్బండ్మీది లేపాక్షి ఎంపోరియం నుంచి అశోక్నగర్ బ్రిడ్జి, ఆర్టీసీ క్రాస్రోడ్స్, హిందీ మహావిద్యాలయల మీదుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు వెళ్తుంది. దీని ద్వారా 17 పార్కులతో పాటు ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంతంలోని 33 పరిశ్రమలతో పాటు ఐదు ప్రైవేటు గృహాలకు కూడా నీరు సరఫరా అవుతోంది.రెండో సరఫరా ట్యాంక్బండ్ మీది క్యాంటిన్ నుంచి లిబర్టీ, బషీర్బాగ్, పోలీస్ కంట్రోల్ రూమ్, పబ్లిక్గార్డెన్స్ మీదుగా బిర్లా ప్లానెటోరియం వరకు వెళ్తుంది. మరో కనెక్షన్ తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింది నుంచి కోఠి ఉమెన్స్ కాలేజి, చాదర్ఘాట్ వద్ద గల విక్టరీ ప్లేగ్రౌండ్లకు వెళ్తుంది. |
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more