మిడిల్ క్లాస్ అబ్బాయి అకా ఎంసీఏ చిత్రం ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో నాని - సాయిపల్లవి జంటగా నటించారు. ఈ ఇద్దరికీ మంచి క్రేజ్ వుంది .. అయినా ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. ఆడియోకి కూడా పెద్దగా రెస్పాన్స్ రాకపోవడం ఈ సినిమా టీమ్ ను మరింత నిరుత్సాహ పరురుస్తోందట.
ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ ను కలిసిన దిల్ రాజు .. ఏదైనా ఒక సాంగ్ ను మరో సాంగ్ తో రీ ప్లేస్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఆ సాంగ్ జనానికి వెంటనే ఎక్కేసేలా ఉండాలని అన్నాడట. విడుదల తేదీ దగ్గరలోనే ఉండటం వలన సాధ్యాసాధ్యాలు గురించి మాట్లాడినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ మరుసటి రోజునే అఖిల్ సినిమా ఉండటం .. ఈ సినిమా ఆడియోకి మంచి బజ్ రావడమే దిల్ రాజు ఈ నిర్ణయానికి రావడానికి కారణమని తెలుస్తోంది.
నాని .. సాయిపల్లవిలకు గల క్రేజ్ ఈ సినిమాను ఏ స్థాయిలో నిలబెడుతుందో చూడాలి మరి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూమిక, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రలు పోషించబోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more