ప్రాంతీయవాదాల హవా నడుస్తున్న సమయమిది. కాస్త తేడా వచ్చినా సరే.., మా లెక్క తేల్చండి మేం వెళ్ళిపోతాం.., విడిపోతాం అని ఉద్యమిస్తున్న రోజులిప్పుడున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు రాజేసి రాజధాని కుంపటి ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయవాడను ఒప్పుకోమంటూ చేస్తున్న ఉద్యమాలు ఎటు వెళ్ళే అవకాశముంది? ఏ పరిణామాలకు దారి తీస్తాయో అని రాజకీయ విశ్లేషకులు తెగ చర్చించుకుంటున్నారు. ఈ ఉద్యమాలు ఏపీ విభజనకు దారితీసినా తీయవచ్చని అంటున్నారు.
విజయవాడ పరిసరాల్లోనే ఏపీ రాజధాని ఏర్పాటు చేస్తామని గురువారం రోజు అసెంబ్లీలో చంద్రబాబునాయుడు ప్రకటించారు. 3 మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తామని ప్రసంగం చేశారు. ఈ ప్రకటన ఏపీ రెండు వైపుల ప్రకంపణలు సృష్టిస్తోంది. రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆ ప్రాంత ప్రజలు ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేశారు. రాయలసీమ రాజధాని సాధన సమితి వంటి సంస్థల ఆద్వర్యంలో కడప, కర్నూలు జిల్లాల్లో బంద్ లు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. గతంలో ఏపీ ఏర్పాటు సమయంలో రాజధాని త్యాగం చేసిన సీమలోనే తిరిగి రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ-సమైక్య ఉద్యమాల సమయంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం నడించింది. బైరెడ్డి రాజశేఖర్ వంటి నేతలు ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ప్రజల్లోకి ప్రత్యేక కాంక్షను తీసుకెళ్ళారు. ఇప్పుడు రాజధాని ఏర్పాటుతో రగిలిన మంట.., తమకు అన్యాయం జరిగిందనే ఆందోళన నుంచి ప్రజలు ప్రత్యేక ఉద్యమం వైపు నడిచే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి.
ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా రాజధాని ప్రకటనపై ప్రజలు మండిపడుతున్నారు. తమ ప్రాంతానికి చంద్రబాబు ప్రసంగంలో కేటాయింపులు చేయలేదని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖను రాజధాని ఏర్పాటు చేయాలని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. ఇక్కడ కూడా ప్రత్యేక ఉత్తరాంధ్ర చేయాలని వాదన విన్పించింది. కొందరు నేతలు ఈ దిశగా పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖను పక్కనబెట్టి విజయవాడ రాజధాని చేయటంపై మొదలైన ఉద్యమం అటు తిరిగి ఇటు తిరిగి ప్రత్యేక పాలన దిశగా వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవేళ ఈ ఉద్యమాలతో తలొగ్గి ప్రభుత్వం రాజదానిపై నిర్ణయం మార్చకున్నా ఉత్తరాంధ్ర లేద రాయలసీమ ఏదో ఒక ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆ తర్వాత కూడా మళ్ళీ ఉద్యమం రాక తప్పదు. మొత్తంగా ప్రత్యేక వాదం అవకాశాలు తక్కవుగా ఉన్నప్పటికీ.., ఉద్యమం రాదని స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒకవేళ ప్రత్యేకవాదం.., ప్రాంతీయవాదం పైకి లేచినా.., ప్యాకేజీలు, ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికల ద్వారా ప్రభుత్వం వాటిని చల్లబరుస్తుందని చెప్తున్నారు. చూడాలి మరి ఈ ఉద్యమాలు ఎటువెళతాయో.., ఈ పరిణామాలకు దారతీస్తాయో.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more