ప్రపంచవ్యాప్తంగా వున్న దేశాలలో కేవలం భారతదేశం ఒక్కటే ప్రాచీన కాలానికి చెందిన సంస్కృతీ-సంప్రదాయాలకు నిలయమని అందరికీ తెలిసిన విషయమే! 5000 సంవత్సరాలకుపైగా పురాతన కాలానికి సంబంధించి ఎన్నో కట్టడాలు, శిథిలాలు దేశంలో లభ్యమయ్యాయి. ఇక వీటితోబాటు దేశంలో రాజ్యమేలిన ఎంతోమంది రాజవంశస్థుల చరిత్రలు కూడా తెలిసిందే! అటువంటివారి చరిత్రపై అధ్యయనాలు చేసినవారు ఎందరో మహానుభావులు వున్నారు. వారి జీవిత విధానాలను, అనుసరించే పద్ధతులను, సంస్కృతీ-సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు విశ్లేషించారు ఆ పరిశోధకులు. అలా పరిశోధనలు చేసినవాళ్లలో డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి ఒకరు. తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు. ఈయన కాకతీయుల చరిత్రపై అనేక అధ్యయనాలు చేసి పలు గ్రంధాలను రచించారు. అందులో ఆయన రాసిన ‘‘ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం’’ గ్రంథం బాగా ప్రాచుర్యం పొందింది.
పరబ్రహ్మశాస్త్రి జరిపిన పరిశోధనలు :
ఈయన కాకతీయుల గురించి, శాతవాహనుల గురించి లోతైన-నికార్సయిన అధ్యయనం చేసిన ఏకైక పరిశోధకుడు. కాకతీయ వైభవానికి సంబంధించి వెలుగుచూడని కొన్ని అంశాలను గుర్తించి, అజ్ఞాతంగా ఉన్న శాసనాలను వెలికితీసి, వాటిపై ప్రామాణిక గ్రంథాలను రచించారు. గ్రామాలకు వెళ్లి అసలు చరిత్ర ప్రజల జీవనవిధానంలోనే ఉందని గుర్తించిన ఈయన.. అదే తపనతో ఆ సమాచారాన్ని ఒడిసిపట్టుకుని ఏ హంగులూ లేనికాలంలో అద్భుతమైన యజ్ఞం చేశారు. ఈవిధంగా తనదైన శైలిలో పరిశోధనలను చేసినందుకుగాను శాస్త్రికి ఎన్నో పురస్కారాలు లభించాయి. ఈయన చరిత్రనే గాక, లిపి పరిణామాన్ని కూడా వివరించి పండితులను మెప్పించిన మేధావి. అలాగే శాసనాలు అన్నీ చదవగలిగిన ఏకైక వ్యక్తి ఈయన ఒక్కరేనని అనేకమందితో గుర్తింపబడ్డారు కూడా!
ఆనాటి చరిత్రను కాలగర్భంలో కలిసిపోకుండా దానిని వెలికితీసి, రాబోయే తరాలకు జ్ఞానాన్ని అందించిన శాస్త్రిని తెలంగాణప్రభుత్వం 2014 అక్టోబర్ 21వ తేదీన సన్మానించింది. అలాగే లక్ష రూపాయల చెక్కును బహూకరించింది. ఈ సన్మాన నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ... ‘‘ప్రస్తుతం హైదరాబాద్ చరిత్రకు కుతుబ్’షాహీలను ఆధారంగా తీసుకుంటున్నాముగానీ.. వాస్తవానికి అంతకంటేముందే విష్ణుకుండినుల మూలపురుషుడు అయిన మాధవ వర్మకు సంబంధించిన శాసనాలు అందుబాటులో ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. మాధవవర్మకు సంబంధించిన శాసనాలను ఆధారంగా తీసుకుని హైదరాబాద్ చరిత్ర చెప్పే ప్రయత్నం నేటి పరిశోధకులు చేయాలని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more