కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నైరాశ్యంలోకి జారుకున్నారా..? లేక వేదంతధోరణిలో వెళ్లిపోయారా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినంత కాలం హుషారుగా, దూకుడుగా వున్న స్మృతి ఇరానీ.. జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు అందుకోగానే అమెలో నిర్వేదం ఎందుకు నెలకొందన్న అనుమానాలు అటు బీజేపి నేతలతో పాటు అమె అభిమానుల్లో కూడా రేకెత్తుతున్నాయి, ఈ తరహా అనుమానాలు కలగడానికి అమె గుజరాత్ లో చేసిన వ్యాఖ్యలే కేంద్రబింధువవుతున్నాయి.
గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న ఇండియా టెక్స్టైల్ ఎగ్జిబిషన్ కు కేంద్ర జౌళి శాఖ మంత్రి హోదాలో స్మృతీ ఇరానీ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో అమెను పలుకరించిన మీడియాకు అమె వేదాంతధోరణిలో సమాధానం చెప్పడంతో మీడియా ప్రతినిధులు విస్మయానికి గురయ్యారు. అమేధి నుంచి గెలుపును లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి హోదాలు అనేక పర్యాయాలు తాను ఓటమిని చవిచూసిన ప్రాంతానికి వెళ్లిన స్మృతి ఇరానీ.. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ యువనేత రాహుల్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
దానిన పరిగణలోకి తీసుకున్న మీడియా.. 2019 ఎన్నికల్లో అమేథీలో తమ రాజకీయ భవిష్యత్తు గురించి ప్రశ్నించగా... ఈ ఎగ్జిబిషన్ జూలై 2న ముగుస్తుందని ..ఆ రోజు తర్వాత ఎక్కడ ఉంటాననే విషయమే తనకు తెలియదని.. ఇక 2019 ఎన్నికల పరిస్థితి గురించి ఇప్పుడే తానెల చెప్పగలను అంటూ నైరాశ్యంలో సమాధానం ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ ను విమర్శించి.. ఇక అవకాశాన్ని చేజింక్కించుకుని మరీ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసే కేంద్రమంత్రి.. ఒక్కసారిగా ఇలా నిర్వేదంలోకి జారిపోయారెందుకు అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అక్కడున్న విలేకరులు మీకు అదర్శమైన రాజకీయ నేత ఎవరని ప్రశ్నించగా, నరేంద్రమోడీ చిత్రపటాన్ని అమె చూపించారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more