యూపీఏ హయాంలో ఆర్ధిక మంత్రిగా కీ రోల్ పోషించిన చిదంబరం కాంగ్రెస్ నావ మునగటంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ప్రస్థుత దుస్థితికి చిదంబరం కారణం అని విమర్శలు విన్పిస్తున్నాయి. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో రాష్ర్ట కాంగ్రెస్ చీఫ్ పదవికి జ్ఞానదేశిగన్ రాజీనామా చేశారు. మామూలుగా అయితే రాజీనామా చేస్తే బుజ్జగింపులు, సంప్రదింపులు ఉంటాయి. కాని దేశిగన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా..., కొత్త అద్యక్షుడుగా ఇళన్ గోవన్ ను నియమించి పార్టీ నాయకత్వం ఆశ్చర్యానికి, షాక్ కు గురిచేసింది.
ఇళన్ నియామకం వెనక చిదంబరం లాబీయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వంకు దగ్గరగా ఉండే చిదంబరంను రాష్ర్ట పరిణామాలపై సలహా కోరగా ఆయన.., ఇళన్ ను పెడితే ఇళ్ళు గాడిలో పడుతుంది అంతే అన్నారట. పెద్దాయన మాట ప్రకారం కొత్త సారధి నియామకంపై పార్టీ నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. అంతే వెంటనే తమిళ కాంగ్రెస్ లో సెగలు మొదలయ్యాయి. ఎవర్ని సంప్రదించి ఈయన్ని ప్రసిడెంట్ చేశారంటూ సీనియర్ నేత వాసన్ సీరియస్ అయ్యారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందని.., ఒక సమస్య తీర్చమంటే పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసేలా చిదంబరం సలహా ఇచ్చారని అంటున్నారు.
చిదంబరం - వాసన్ మద్య పలు విషయాల్లో విభేధాలు ఉన్నట్లు తమిళనాట ప్రచారంలో ఉంది. అందువల్లే వాసన్ మద్దతుదారుడుగా ఉన్న జ్ఞానదేశిగన్ రాజీనామా చేయగానే.. ఆలోచించకుండా తనకు అనుకూలంగా ఉండే ఇళన్ గోవన్ కు పగ్గాలు అప్పగించారు. ఈ నిర్ణయమే తమిళనాడులో కాంగ్రెస్ ఖాళీ అయ్యేలా చేసింది. ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. అందులో మొదటిది వ్యక్తిగత ప్రయోజనాలు, కోపాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే పార్టీ మనుగడ సాగించలేదు. ఇక రెండవది ఏమంటే..., రాజకీయాల్లో ముందస్తు వ్యూహం, తాజా పరిణామాలకు కారణాలపై అవగాహన లేకుండా వ్యవహరిస్తే మోసపోక తప్పదు అని. బహుశా ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకత్వంకు ఇది తెలిసివస్తుందేమో.
కార్తిక్
(this content is not having accurate information. it is given just on web source information only. not posted in a manner to demolish one's. readers are advised to be aware of own knowledge while responding on this article)
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more