రాజకీయాలు ఎంతవరకైనా దారి తీస్తాయి. ప్రత్యర్ధిని దెబ్బకొట్టడానికి ఉన్న ప్రతి మార్గాన్ని ఉపయోగించుకోవటం నేతలకు కొత్తేం కాదు.. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు నిత్య పోరుగా మారింది టీడీపీనే. పసుపు చొక్కా నేతలు గులాబీపై రోజూ గుస్సా అవుతున్నారు. ఏదో ఒక విషయం తీసుకుని విమర్శిస్తున్నారు. దీంతో కుదిరితే పార్టీ పరంగా కలిసివస్తే ప్రభుత్వ పరంగా టీడీపీకి షాక్ ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా ఎందుకు చెప్తున్నామంటే.., తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో భాగంగా పాల కల్తీపై చర్చ జరిగింది. కల్తీ వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని దీన్ని ఎంతమాత్రం ఉపేక్షించవద్దని అన్ని పార్టీల సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి మాట్లాడిన ఏనుగు రవీందర్ రెడ్డి, హెరిటేజ్ సంస్థ పాలపై గతంలో చాలా కధనాలు వచ్చాయనీ, దీన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సభలో టీడీపీ-టీఆర్ఎస్ మద్య గందరగోళంకు తెరలేచింది. తమ పార్టీని దెబ్బకొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అటు పాల కల్తీపై రాజకీయం చేయకుండా ప్రభుత్వం నిస్పక్షపాతంగా వ్యవహరించాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. కాని హెరిటేజ్ పై చర్యలు తీసుకోవటం సరికాదని చెప్పలేదు. ప్రభుత్వం స్పందించి హెరిటేజ్ పై ఆకస్మిక దాడులు, వరుస తనిఖీలు చేపడితే.., ఎక్కడ చిన్నలోపం దొరికినా అది చాలు బాబును బుక్ చేయటానికి అని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీల్లో ప్రైవేటు డెయిరీ సంస్థల్లో హెరిటేజ్ అగ్రగామిగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కన్ను ఈ సంస్థపై పడితే టీడీపీకి రాజకీయంగా ఎంతవరకు ఇబ్బంది ఉంటుందో చెప్పలేము కాని.., ఆర్ధికంగా చంద్రబాబు ఫ్యామిలికి మాత్రం నష్టం తప్పదు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో త్వరలో తెలియనుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more