ఖైరతాబాద్ గోనాగ చతుర్ముఖ మహా గణపతికి సెప్టంబర్ 18తేది 2013న వీడ్కోలు పలకటానికి భక్తులు సిద్దమయ్యరు. ఖైరతాబాద్ మహా వినాయకుడు ఈ ఏడాది అందరిని కనువిందు చేస్తున్నాడు. ఈ సంవత్సరం గోనాగ చతుర్ముఖ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. దీంతో విఘ్నేశ్వరున్ని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. భారీగా కొలువుదీరిన ఆ గణేషుని దగ్గరి నుంచి దర్శిస్తూ.. నగర వాసులు భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. 59 వ వార్షికోత్సవంలో భాగంగా ఈ సారి 59 అడుగుల భారీ గణనాథున్ని ఖైరతాబాద్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు తయారు చేయించారు. గణపతికి కుడివైపు విజయ రామ పట్టభిషేక దృశ్యం, ఎడమ వైపు భువనేశ్వరి దేవి విగ్రహాలు కొలువుదీరాయి. కళేబరాలకు తరలుతున్న గోవులను కాపాడే దిశలో ఈ సారి గోనాగ చతుర్ముఖ గణేషుని తయారు చేస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు చెప్పటం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆ లంబోధరుడి పనులను కమిటీ సభ్యులు మూడు నెలలు ముందుగానే ప్రారంభించారు. ఏకాదశి పుణ్య దినాన కర్ర పూజ చేసి వినాయకుడి పనులు ప్రారంభించగా.. 2 రోజుల ముందుగానే పనులు పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం భక్తులను ఆకర్షించే రూపాల్లో కొలువుదీరే ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య ఈ సారి గోనాగ చతుర్ముఖ రూపంలో దర్శనమిస్తున్నాడు. దీంతో విఘ్నేశ్వరున్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో ఖైరతాబాద్ ప్రాంతం అంత కిటకిటలాడుతోంది.
25టన్నుల కొద్ది స్టీల్, క్వింటల్ల కొద్ది.. ముడి సరుకులతో భారీ గణేషుడు కొలువుదీరాడు. ఏడాదికో అడుగు వంతున పెరుగుతూపోతున్న భారీ లంబోదరుడిని చూసేందుకు జంట నగరాలతో పాటూ.. రాష్ట్ర వ్యాప్తంగా జనం తరలిరానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లతో పాటూ.. భద్రతా దృష్ట్యా 6 సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
మహా లడ్డు
ఇక ఖైరతాబాద్ భారీ గణేషుడి చేతిలో కొలువుదీరేందుకు తాపేశ్వరంలో మహా లడ్డూ తయారైంది. ఈ సారి 4 వేల 2 వందల కిలోల లడ్డూ గణేషుడి చేతిలో కనిపించనుంది. ఇందుకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా.. తాపేశ్వరానికి చెందిన మల్లె బాబకు అనే భక్తుడు ఈ భారీ లడ్డూను అందించటం జరిగింది. మరోవైపు భద్రతా కారణాల నేపథ్యంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేయటం జరిగింది. అయితే భక్తజన సందోహం మధ్య ఖైరతాబాద్ గోనాగ చతుర్ముఖ మహా గణపతికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమవుతుంది. హైదరాబాద్ ఖైరతాబాద్ గోనాగ చతుర్ముఖ మహా గణపతికి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టంబర్ 9 నుండి గణపతి నవరాత్రులు మొదలైన విషయం తెలిసిందే. సెప్టంబర్ 18తేది 2013న హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల నుండి గణపతి హుస్సెస్ సాగర్ తీరానికి చేరుకుంటారు.ఈవినాయక నిమజ్జనానికి లక్షల సంఖ్యలో భక్తులు హజరవుతారు. రేపు జరిగే వినాయక నిమజ్జనానాకి భారీ బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పటికే ఇంటలీజెన్స్ హెచ్చరికతో నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే నగరంలోకి 25 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని అనురాగ్ శర్మ తెలిపారు. గణేశ్ మండపాల నిర్వాహకులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నామని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. వెయ్యి మంది కానిస్టేబుళ్లు, మరో వెయ్యి మంది హోంగార్డులు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు తోడ్పడతారన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 32 మంది బాంబు స్క్వాడ్ సిబ్బంది చూసుకుంటారని , 800 వీడియో కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more