Man eats sand for the last 40 years in Odisha 40 ఏళ్లుగా అది తింటేనే కానీ ఆయన బోజనం పూర్తి కాదు..

Watch man eats sand for the last 40 years in odisha

Man eat sand for the last 40 years, Odisha labourer eats sand everyday, Bizzare incident of a man consuming sand, Harilal saxena, Sand Eater, Arangapur, Uttar Pradesh, construction worker, Kiaful Bhati, Kimpur village, Rangellunde block, Laudiga panchayat, Odisha, weird news

A 68-year-old man, native of Arangapur, Uttar Pradesh has been eating sand for the last 40 years. Harilal Saxena has been eating a handful of sand daily after having his lunch and dinner. Hiralal - a construction worker - working as a labour at Kiaful Bhati in Kirtipur village in Rangeilunda block under Laudiga panchayat, in Ganjam district says he feels uncomfortable if he did not eat sand but has never faced any health-related issues for this.

ITEMVIDEOS: 40 ఏళ్లుగా అది తింటేనే కానీ ఆయన బోజనం పూర్తి కాదు..

Posted: 06/09/2022 05:20 PM IST
Watch man eats sand for the last 40 years in odisha

రోజు ఒకే రకమైన కూర వండితేనే రోజు ఇదేనా అంటూ ఇల్లాలిపైన అంతెత్తున లేస్తారు మగవారు. ఇక దీనికి తోడు మాకోద్దూ అంటే అవసరమైతే దీక్షలకు కూడా పూనుకుంటారు పిల్లలు. అయితే ఇక్కడ కూర ఒక్కటే అయినా దానిని ఒక రోజు వేపుడు, మరో రోజు ఇగురు, ఇంకోరోజు పులుసు, ఇలా ఒక్కో రకంగా చేసినా.. అస్సలు ముట్టం అంటూ మారం చేస్తారు. ఇక అన్నం తింటుండగా అన్నంలోనో లేక కూరలోనో ఒక్క చిన్న రాయి వస్తే తుప్పున బయటకు ఉమ్మేస్తాం.. అంతటితో ఆగకుండా నోరు కూడా కడుక్కుని రమ్మని సూచిస్తారు పెద్దలు. ఇదిలా ఉంచితే రోజు బిర్యాని పెట్టినా తినలేమన్మది వాస్తవం. ఇక అదే బిర్యానిని ఎంతో ఇష్టంగా లాగిస్తుంటే.. అందులో రాయి వస్తే ఎలా ఉంటుంది.

ఏదో విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు. కానీ ఇక్క రెండు అంశాలు వున్నాయి అంటారా.? మీరు కరెక్టుగా గెస్ చేశారు. రోజు ఒకే వంటకం తినాలంటేనే బోర్ కోట్టేసి వద్దని నిర్మోహమాటంగా చెప్పే మనకు రోజూ.. ఒకే అహారాన్ని ఏకంగా నలభై ఏళ్లుగా తీసుకుంటున్న వ్యక్తిని చూస్తే ఏమంటాం. ఔనా అంటాం. ఇంతకీ ఆయన తీసుకునే ఆ రోజువారి ఆహారం ఏంటో తెలుసా.? నమ్మలేరు. ఎందుకంటే ఆయన ప్రీతికరమైన ఆహారం ఇసుక. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 365 రోజులు.. నాలుగు దశాబ్దాలుగా ఇసుకను భోజనంలా లాగించేస్తున్నాడు ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి.. ఇసుకను అన్నంలా నోట్లో వేసుకుని కరకరలాడించేస్తున్నాడు!

హరిలాల్ సక్సేనా. అనే ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని అరంగాపూర్ కు చెందినవాడు. కాగా పదేళ్ల క్రితమే ఒడిశాకు వలస వచ్చాడు. గంజాం జిల్లా కీర్తిపూర్ లో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి 40 ఏళ్లుగా ఇసుక తినే అలవాటుంది. భోజనానికి ముందో లేదంటే భోజనం తరువాతో ఇసుకను స్నాక్స్ లాగా ఆరగించేస్తున్నాడు. అయితే, ఒకప్పుడు చాలా ఎక్కువగా తినేవాడినని, ఇప్పుడు తగ్గించేశానని హరిలాల్ చెబుతున్నాడు. చిన్నానాటి నుంచే ఈ అలవాటు ఉందని అన్నాడు. ఇసుక తిన్న తర్వాత కాస్తంత అసౌకర్యంగా అనిపించినా.. ఆ తర్వాత అంతా మామూలుగా అవుతుందని వివరించాడు. ఇప్పటిదాకా తనకు ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles