రోజు ఒకే రకమైన కూర వండితేనే రోజు ఇదేనా అంటూ ఇల్లాలిపైన అంతెత్తున లేస్తారు మగవారు. ఇక దీనికి తోడు మాకోద్దూ అంటే అవసరమైతే దీక్షలకు కూడా పూనుకుంటారు పిల్లలు. అయితే ఇక్కడ కూర ఒక్కటే అయినా దానిని ఒక రోజు వేపుడు, మరో రోజు ఇగురు, ఇంకోరోజు పులుసు, ఇలా ఒక్కో రకంగా చేసినా.. అస్సలు ముట్టం అంటూ మారం చేస్తారు. ఇక అన్నం తింటుండగా అన్నంలోనో లేక కూరలోనో ఒక్క చిన్న రాయి వస్తే తుప్పున బయటకు ఉమ్మేస్తాం.. అంతటితో ఆగకుండా నోరు కూడా కడుక్కుని రమ్మని సూచిస్తారు పెద్దలు. ఇదిలా ఉంచితే రోజు బిర్యాని పెట్టినా తినలేమన్మది వాస్తవం. ఇక అదే బిర్యానిని ఎంతో ఇష్టంగా లాగిస్తుంటే.. అందులో రాయి వస్తే ఎలా ఉంటుంది.
ఏదో విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు. కానీ ఇక్క రెండు అంశాలు వున్నాయి అంటారా.? మీరు కరెక్టుగా గెస్ చేశారు. రోజు ఒకే వంటకం తినాలంటేనే బోర్ కోట్టేసి వద్దని నిర్మోహమాటంగా చెప్పే మనకు రోజూ.. ఒకే అహారాన్ని ఏకంగా నలభై ఏళ్లుగా తీసుకుంటున్న వ్యక్తిని చూస్తే ఏమంటాం. ఔనా అంటాం. ఇంతకీ ఆయన తీసుకునే ఆ రోజువారి ఆహారం ఏంటో తెలుసా.? నమ్మలేరు. ఎందుకంటే ఆయన ప్రీతికరమైన ఆహారం ఇసుక. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 365 రోజులు.. నాలుగు దశాబ్దాలుగా ఇసుకను భోజనంలా లాగించేస్తున్నాడు ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి.. ఇసుకను అన్నంలా నోట్లో వేసుకుని కరకరలాడించేస్తున్నాడు!
హరిలాల్ సక్సేనా. అనే ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని అరంగాపూర్ కు చెందినవాడు. కాగా పదేళ్ల క్రితమే ఒడిశాకు వలస వచ్చాడు. గంజాం జిల్లా కీర్తిపూర్ లో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి 40 ఏళ్లుగా ఇసుక తినే అలవాటుంది. భోజనానికి ముందో లేదంటే భోజనం తరువాతో ఇసుకను స్నాక్స్ లాగా ఆరగించేస్తున్నాడు. అయితే, ఒకప్పుడు చాలా ఎక్కువగా తినేవాడినని, ఇప్పుడు తగ్గించేశానని హరిలాల్ చెబుతున్నాడు. చిన్నానాటి నుంచే ఈ అలవాటు ఉందని అన్నాడు. ఇసుక తిన్న తర్వాత కాస్తంత అసౌకర్యంగా అనిపించినా.. ఆ తర్వాత అంతా మామూలుగా అవుతుందని వివరించాడు. ఇప్పటిదాకా తనకు ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదని చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more