మాజీ మంత్రి వై.ఎస్.వివేకా హత్యకేసు విచారణను సీబిఐ అధికారులు కొనసాగిస్తున్న తరుణంలోనే కీలక పరిణామాం చోటుచేసుకుంది. వైఎస్ వివేకా హత్యకేసులో సాక్షిగా ఉన్న కల్లూరు గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి పలు సందేహాలకు కారణమవుతోంది. బుధవారం రాత్రి ఆయన మృతి చెందినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని యాడికిలో గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఇదిలావుండగా ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఈ మరణాన్ని సీబిఐ మెడకు చుట్టుతున్నారు. సీబిఊ అధికారుల ఒత్తడే గంగాధర్ రెడ్డి మరణానికి కారణమని అరోపిస్తున్నారు.
అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు తనను తీవ్ర ఒత్తిడి చేశారని గంగారెడ్డి గతంలోనే ఆరోపణలు కూడా చేయడం.. ఇదే విషయంపై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు ఇచ్చాడు. కాగా, వివేకానంద హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దేవిరెడ్డి శంకర్ రెడ్డికి గంగాధర్రెడ్డి అనుచరుడిగా ఉన్నాడు. ప్రేమవివాహం చేసుకున్న గంగాధర్ రెడ్డి... స్వగ్రామం పులివెందుల విడిచి యాడికిలో ఉంటున్నాడు. ఈ కేసులో తనకు ప్రాణానికి ముప్పుపొంచి ఉందంటూ అనంతపురం జిల్లా ఎస్పీని 2 సార్లు కూడా కలిసి వినతిపత్రం కూడా సమర్పించాడు. రక్షణ కల్పించాలని కోరాడు. అయితే నిద్రలోనే అతను మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు గంగాధర్ రెడ్డి ఇంట్లోని పరిసరాలను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి 2019 ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణ పేరుతో సిట్ వేధిస్తోందంటూ కూల్ డ్రింక్ లో గుళికలు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది.పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ నోట్ లో వెల్లడించారు. వివేకా హత్యకేసుతో తనకు సంబంధం లేదంటూ లేఖలో తెలిపారు. తాజాగా సాక్షి గంగాధర్ రెడ్డి చనిపోవటం... ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more