Bathinda Man Finally Wins Rs 2.5 Crore Punjab State Lottery దశాబ్దాలుగా లాటరీ టికెట్లు కొంటున్నా.. 34 ఏళ్లకు ‘అంబ పలికింది’

Bathinda man finally wins rs 2 5 crore punjab state lottery after buying tickets for 34 years

viral,trending news, Roshan Singh, Bathinda, lottery tickets, clothes shop, Roshan’s wife, mega prize, Rs. 2.5 crore, Punjab State Dear Baisakhi Bumper Lottery 2022, Punjab State Dear Baisakhi Bumper Lottery 2022 result, Punjab State Dear Baisakhi Bumper Lottery 2022 winner, Punjab State Dear Baisakhi Bumper Lottery, Punjab State Lottery 2022, Punjab State Lottery,lottery ticket result

A man from a village in Bathinda, Roshan Singh, who was buying lottery tickets for decades is finally seeing his dream come true after 34 long years. He has been buying lottery tickets continuously since 1988. Occasionally, he would win Rs. 100-200 and hoped of recovering whatever money he put in the gamble.

దశాబ్దాలుగా లాటరీ టికెట్లు కొంటున్నా.. 34 ఏళ్లకు ‘అంబ పలికింది’

Posted: 04/23/2022 06:43 PM IST
Bathinda man finally wins rs 2 5 crore punjab state lottery after buying tickets for 34 years

ఏదో ఓ రోజు తనకు లాటరీ తగలకపోతుందా అని 34 ఏళ్లుగా లాటరీ టికెట్స్‌ కొంటున్న వ్యక్తి బంపర్‌ ప్రైజ్‌ కొట్టేశాడు. అవును కొందరి జాతకంలో అకస్మాత్తు ధనలాభం అంటూ ఉంటుంది. అంటే ఇలానే ఏదో లాటరీ రూపంలో ఏకంగా వారి ధరిద్రం తీరిపోయేలా డబ్బుల వర్షం కురుస్తుందని అర్థం. అయితే కొందరు వీటని పట్టించుకోరు. అదృష్టం ఉంటే వచ్చి తగలకుండా ఎక్కడకు పోతుంది. అప్పటివరకు మనం మన చేసుకుందాం అంటారు. అయితే కోందరు మాత్రం తాము ఏ పనిచేస్తున్నా.. తమఅదృష్టాన్ని మాత్రం అనుక్షణం పరీక్షించుకుంటూనే ఉంటారు. అలాంటి వ్యక్తి ఏకంగా రూ.2.5 కోట్ల ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. భ‌టిండా జిల్లాకు చెందిన రోష‌న్ బ‌ట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. రోషన్‌కు లాటరీ టికెట్స్‌ కొనడం అలవాటు.. అందులో భాగంగానే 34 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. వీటిల్లో అప్పుడప్పుడూ రూ. 100, రూ. 200 ప్రైజ్‌లు వచ్చాయి. కానీ, అతడి ఆశ మాత్రం తీరలేదు. ఇలా ఎప్పుడూ లాటరీ టికెట్స్‌ కొనడంతో రోష‌న్ భార్య త‌ర‌చూ అత‌డిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. ఇదిలా ఉండగా.. తాజాగా పంజాబ్ స్టేట్ డియర్ వైశాఖి బంప‌ర్ లాట‌రీలో మెగా ప్రైజ్ గెలుపొంద‌డంతో రోష‌న్ సింగ్ ఆనందం వ్యక్తం చేశాడు.

మొదట బంప‌ర్ ప్రైజ్ గెలుచుకున్నట్టు రోషన్‌కు డీలర్‌ నుంచి ఫోన్ కాల్‌ రాగా అది ఫ్రాంక్ కాల్ అనుకున్నాడు. అనంతరం తాము రాంపుర ఫుల్ లాట‌రీ సెంట‌ర్ నుంచి ఫోన్ చేస్తున్నామ‌ని ఏజెంట్ చెప్పడంతో ఎగిరి గంతేశాడు. ఈ సందర్భంగా రోషన్‌ మాట్లాడుతూ.. లాటరీ ప్రైజ్ గెలుచుకున్నానని తెలుసుకున్న రోజు రాత్రంతా నిద్రపోలేద‌ని తెలిపాడు. లాటరీలో వచ్చిన డబ్బులపై ప‌న్నుల‌న్నీ తీసాక త‌మ‌కు రూ 1.75 కోట్లు వ‌స్తాయ‌ని లెక్కలేసుకున్నానని అన్నాడు. లాటరీ మనీ మొత్తాన్ని తన ఫ్యామిలీ కోసం, కొత్త వ్యాపారం కోసం ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles