Farmer whose wedding video went viral dies by suicide ఐదు నెలల క్రితం వైరల్ గా ‘‘45 వెడ్స్ 25’’ జంట.. ఇప్పుడు విషాదం..

Karnataka farmer whose wedding video went viral dies by suicide

wife mother quarell, viral bride died by suicide, wife tourchered Husband, Marriage, viral marriage, Shankarappa, meghana, land, suicide, mother in law, Rs 2.5 crore Land, Huliyuru Durga Police station, Akkimaripalya, Kunigal taluk, Tumakuru, karnataka, Crime

In October 2021, the marriage of Shankarappa, a 45-year-old farmer from Akkimaripalya in Kunigal Taluk went viral as the bride was 20 years younger than him. Shankarappa was unmarried while his wife was separated from her husband. The duo’s marriage photo went viral as it was a love marriage and bride herself proposed marriage. But now in a tragic end to the marriage, Shankarappa died by suicide. He died suicide by hanging from a tree at his farm.

ఐదు నెలల క్రితం వైరల్ గా ‘‘45 వెడ్స్ 25’’ జంట.. ఇప్పుడు విషాదం..

Posted: 03/29/2022 06:14 PM IST
Karnataka farmer whose wedding video went viral dies by suicide

ఐదు నెలల క్రితం వారిద్దరి పెళ్లి సామాజిక మాద్యమాల్లో వైరల్ గా నిలిచింది. ఓ పెళ్లికాని నడివయస్సు వ్యక్తిని ఓ వివాహిత ఇష్టపడి పెళ్లిచేసుకోవడం బెంగళూరుతో పాటు కర్ణాటక సహా యావత్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అరు నెలలు కూడా తిరిగకుండానే ఆ జంట మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు ఆ జంటలోని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడటంతో విషాదంతో వార్తగా మారింది. ఇరవై ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 45ఏళ్ల వ్యక్తి కుటుంబసమస్యల కారణంగా ఆత్మహత్యాకు పాల్పడటంతో ఐదు నెలల క్రితం హర్షం వ్యక్తం చేసిన నేటిజనులు.. తమ దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఐదు నెలల క్రితం వైరల్ వార్తగా మారి.. నెటిజనుల నుంచి లభించిన ప్రోత్సాహం, ప్రశంసల నేపథ్యంలో ఒక్కటైన ఇద్దరు అంతలోనే విధి శాశ్వతంగా విడదీసింది. పెళ్లి చేసుకున్న సంతోషం ఆ వ్యక్తిలో అరు నెలలు కూడా లేకపోయింది. ప్రతినిత్యం కుటుంబ సమస్యలతో సతమతం కాలేక.. అటు తల్లిని ఒప్పించలేక, ఇటు భార్యను నోప్పించలేక తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక తుమకూరు జిల్లాలోని అక్కిమరిపాళ్య గ్రామంలో జరిగింది. అనివార్య కారణాల వల్ల పెళ్లికి దూరంగా ఉన్న శంకరప్పకు 45 ఏళ్లు. అయితే ఇతను పెళ్లి చేసుకోవాలన్న అలోచన కూడా లేకుండాపోయింది.

అయితే తన తల్లి, బంధువుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించాడు. అయితే ఆయన విషయం తెలుసుకున్న మేఘన(25).. అతడ్ని ప్రేమించింది. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకుంది. ఇద్దరూ కలసి మాట్లాడేవారు. అయితే.. అప్పటికే మేఘనకు వివాహం అయింది. కాగా రెండేళ్ల క్రితం ఇంట్లోంచి బయటకు వెళ్లిన అమె భర్త ఇంటికి తిరిగిరాలేదు. ఎటు వెళ్లాడన్న వివరాలు కూడా తెలియదు. దీంతో కొంతకాలం వేచి చూసిన కుటుంబసభ్యలు అతడు అదృశ్యమయ్యాడని నిర్థారించుకున్నారు. దీంతో శంకరయ్యతో అమె ప్రేమలో పడింది. దీనికి ఇద్దరు కుటుంబాలు అంగీకరించడంతో వారు ఒక్కటయ్యారు.

శంకరప్ప- మేఘనను 2021 అక్టోబర్​లో గుడిలో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి వార్త అప్పట్లో వైరల్​ అయింది. ఎందరెందరో నెటిజనులు వీరిని ఆశీర్వదించారు. ఒక నెల వరకు వీరి దాంపత్య జీవితం బాగానే ఉంది. ఆ తరువాత నుంచి మేఘనకు అమె అత్తగారికి ఇమడలేదు. దీంతో మేఘన.. తన అత్తగారితో నిరంతరం గొడవపడేది. శంకరయ్యకు చెందిన రూ.2.5కోట్ల భూమిని అమ్మేయాలని ఇటీవల ఇంట్లో ఒత్తిడి తెచ్చింది. ఇందుకు శంకరయ్య అమ్మ అంగీకరించలేదు. తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో శంకరయ్య విసిగిపోయాడు. పొలంలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles