ఐదు నెలల క్రితం వారిద్దరి పెళ్లి సామాజిక మాద్యమాల్లో వైరల్ గా నిలిచింది. ఓ పెళ్లికాని నడివయస్సు వ్యక్తిని ఓ వివాహిత ఇష్టపడి పెళ్లిచేసుకోవడం బెంగళూరుతో పాటు కర్ణాటక సహా యావత్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అరు నెలలు కూడా తిరిగకుండానే ఆ జంట మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు ఆ జంటలోని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడటంతో విషాదంతో వార్తగా మారింది. ఇరవై ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 45ఏళ్ల వ్యక్తి కుటుంబసమస్యల కారణంగా ఆత్మహత్యాకు పాల్పడటంతో ఐదు నెలల క్రితం హర్షం వ్యక్తం చేసిన నేటిజనులు.. తమ దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఐదు నెలల క్రితం వైరల్ వార్తగా మారి.. నెటిజనుల నుంచి లభించిన ప్రోత్సాహం, ప్రశంసల నేపథ్యంలో ఒక్కటైన ఇద్దరు అంతలోనే విధి శాశ్వతంగా విడదీసింది. పెళ్లి చేసుకున్న సంతోషం ఆ వ్యక్తిలో అరు నెలలు కూడా లేకపోయింది. ప్రతినిత్యం కుటుంబ సమస్యలతో సతమతం కాలేక.. అటు తల్లిని ఒప్పించలేక, ఇటు భార్యను నోప్పించలేక తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక తుమకూరు జిల్లాలోని అక్కిమరిపాళ్య గ్రామంలో జరిగింది. అనివార్య కారణాల వల్ల పెళ్లికి దూరంగా ఉన్న శంకరప్పకు 45 ఏళ్లు. అయితే ఇతను పెళ్లి చేసుకోవాలన్న అలోచన కూడా లేకుండాపోయింది.
అయితే తన తల్లి, బంధువుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించాడు. అయితే ఆయన విషయం తెలుసుకున్న మేఘన(25).. అతడ్ని ప్రేమించింది. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకుంది. ఇద్దరూ కలసి మాట్లాడేవారు. అయితే.. అప్పటికే మేఘనకు వివాహం అయింది. కాగా రెండేళ్ల క్రితం ఇంట్లోంచి బయటకు వెళ్లిన అమె భర్త ఇంటికి తిరిగిరాలేదు. ఎటు వెళ్లాడన్న వివరాలు కూడా తెలియదు. దీంతో కొంతకాలం వేచి చూసిన కుటుంబసభ్యలు అతడు అదృశ్యమయ్యాడని నిర్థారించుకున్నారు. దీంతో శంకరయ్యతో అమె ప్రేమలో పడింది. దీనికి ఇద్దరు కుటుంబాలు అంగీకరించడంతో వారు ఒక్కటయ్యారు.
ః
శంకరప్ప- మేఘనను 2021 అక్టోబర్లో గుడిలో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి వార్త అప్పట్లో వైరల్ అయింది. ఎందరెందరో నెటిజనులు వీరిని ఆశీర్వదించారు. ఒక నెల వరకు వీరి దాంపత్య జీవితం బాగానే ఉంది. ఆ తరువాత నుంచి మేఘనకు అమె అత్తగారికి ఇమడలేదు. దీంతో మేఘన.. తన అత్తగారితో నిరంతరం గొడవపడేది. శంకరయ్యకు చెందిన రూ.2.5కోట్ల భూమిని అమ్మేయాలని ఇటీవల ఇంట్లో ఒత్తిడి తెచ్చింది. ఇందుకు శంకరయ్య అమ్మ అంగీకరించలేదు. తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో శంకరయ్య విసిగిపోయాడు. పొలంలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more