తెలంగాణలో ప్రశ్నాపత్రం లీక్ వ్యవహరం వెలుగుచూసింది. పాలిటెక్నిక్ డిప్లొమా పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ కావడం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ శివారులోని స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ప్రశ్నాపత్రాలు సామాజిక మాధ్యమాల ద్వారా లీక్ అయినట్టు బయటపడింది. ఈమేరకు రాష్ట్ర సాంకేతిక విద్యమండలి అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కళాశాల చీఫ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేషన్ అధికారి, ఆచార్యుడి ద్వారానే ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్టు బయటపడింది. వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్మెట్ లోని స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ద్వారా ప్రశ్నాపత్రాలు లీకేజీ అయినట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి అధికారులు గుర్తించారు. ఈ నెల 8 నుంచి పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే వాట్సాప్ ద్వారా ప్రశ్నా పత్రాలు స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్ధులకు పరీక్ష ప్రారంభం కంటే ముందుగా లీక్ అయినట్టు బయటపడింది. కళాశాల విద్యార్ధుల ద్వారా ఇతర కళాశాలల విద్యార్ధులకు ప్రశ్నా పత్రాలు వాట్సాప్ ద్వారా వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేషన్ అధికారి కృష్ణ మూర్తి, ఆచార్యుడు కృష్ణ మోహన్ ద్వారా ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు తేలింది.
పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచే కళాశాలలో పనిచేసే చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేషన్ అధికారి కృష్ణమూర్తి, ఆచార్యుడు కృష్ణ మోహన్ కలిసి లీకేజీ తతంగం కొనసాగిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే కళాశాల విద్యార్థులకే కాకండా ఇంకా ఎవరెవరికి ప్రశ్నాపత్రాలు చేరాయి అనే విషయంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల, పరీక్ష కేంద్రాన్ని మూసివేశారు. అయితే ఈ వ్యవహారంతో మొత్తం పరీక్షలు రద్దయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. లీకేజీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇందుకు కారకులైన వారిని ప్రశ్నిస్తున్నారు. వీరిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more