భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ ఈ నెల 8న హెలికాప్టర్ క్రాష్ లో మరిణించిన విషయం తెలిసిందే. కాగా ఈ హెలికాప్టర్ ప్రమాదఘటనలో ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో బెంగుళూరులోని ఆర్మీ అసుపత్రిలో చికిత్ప పోందుతున్న ఒకే ఒక్కరు గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.. ప్రమాదం జరిగిన ఎనిమిది రోజుల తరువాత ఇవాళ పోరాటాన్ని విరమించాడు. ఆయన చికిత్స పోందుతూ ఇవాళ బెంగళూరులోని ఆర్మీ ఆసుపత్రిలోనే కన్నుమూశారు. ఈ నెల 8న ప్రమాదం అనంతరం ఆయనను కూనూరులోని వెల్లింగ్టన్ అసుపత్రికి తరలించిన చికిత్స అందించారు.
ఆయన పరిస్థితి నిలకడగా వున్నా.. విషమంగానే ఉండడంతో.. ఆయనను బెంగుళూరులోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. ఆయనను కాపాడేందుకు ఆర్మీ వైద్య బృందాలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కాగా, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తుది శ్వాస విడవడంపై రాష్ట్రపతి, ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మాతృభూమి కోసం అత్యంత ధైర్య పరాక్రమాలతో ఆయన సేవలు చేశారని కొనియాడారు.
రాంనాథ్ కోవింద్ (రాష్ట్రపతి)
ఈ దేశం ఆయనకు ఎంతో రుణపడి ఉంటుంది. ఆయన చూపిన ధైర్య సాహసాలు, పరాక్రమం అద్భుతమైనవి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.
నరేంద్ర మోదీ (ప్రధాన మంత్రి)
కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి చెందడం చాలా బాధగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అత్యంత గర్వంగా, వృత్తి నిపుణతతో ఈ మాతృభూమికి సేవలు చేశారని ట్విట్టర్ వేదికగా ప్రధాని కొనియాడారు. ఆయన మరణించడం చాలా బాధగా ఉందని, దేశం కోసం ఆయన చేసిన సేవలు ప్రజలెప్పటికీ మరిచిపోరని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more