ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి ఘటనను సృష్టించిన భీభత్సంలో అలుముకున్న విషాధచాయలు ఇంకా కళ్లముందు మొదులుతున్న తరుణంలోనే హర్యానాలోనూ ఇదే తరహాలో ఓ ఘటన చోటుచేసుకుంది. లఖీంపూర్ ఖేరీ ఘటనలో కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశీష్ మిశ్రా రైతులపైకి కారును తొక్కిస్తూ వెళ్లడాని రైతులు అరోపిస్తుండగా, అదే తరహాలో హర్యానాలోనూ ఓ బీజేపి పార్లమెంటు సభ్యుడు రైతులపైకి కారును దూసుకెళ్లేలా చేసి.. అందోళన చేస్తున్న రైతులలో ఒకరి తీవ్రగాయాలకు కారణమయ్యాడని అరోపణలు వస్తున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ ఎంపీ నయాబ్ సైనీకి చెందిన కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు రైతులు ఆరోపించారు. గాయపడిన రైతును అంబాల సమీపంలోని నారిన్గఢ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశామని, అతడి పరిస్థితి సీరియస్గా ఉన్నదని తెలిపారు. తనపైకి బీజేపీ ఎంపీ కారు దూసుకురాగా తృటిలో తప్పించుకున్నట్లు ఒక రైతు ఆరోపించాడు. కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నయాబ్ సైనీ, హర్యానా మైనింగ్ మంత్రి మూల్ చంద్ శర్మతో సహా ఇతర పార్టీ నాయకులు నారిన్ గఢ్ లోని సైనీ భవన్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.
కాగా, బీజేపీ నేతల పర్యటనను వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు ఆ భవనం బయట పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను తక్షణం బేషరుతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తమ సమావేశ కార్యక్రమం ముగియడంతో బయటకు వచ్చిన బీజేపీ ఎంపీ నయాబ్ సైనీ కారులో కూర్చోగా.. కారును ముందుకు వెళ్లనీయకుండా రైతులు ఘెరావ్ చేశారు.
కాగా ఆయన కాన్వాయ్ లోని ఓ కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన రైతులు ఆ రైతును అంబాలాలోని అసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే రైతు పరిస్థితిపై మాత్రం ఇప్పడే ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై అరోపణలు ఎదుర్కొంటున్న పార్లమెంటు సభ్యుడిపై కేసు నమోదు చేయాలని హర్యానా రైతులు డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీలోపు ఇది జరుగకపోతే పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more