భూమి వివాదం కేసులో తన ప్రత్యర్థిపై దాడి చేసిన నిందితులపై పిర్యాదు రావడంతో వారిని విచారించేందుకు వెళ్లిన పోలీసులకు చేధు అనుభవం ఎదురైంది. అయితే ఇదివరకు కూడా ఇలాంటి అనుభవాన్నే చవిచూసిన పోలీసులు వెంటనే తేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సినీనిర్మాత, వైసీపీ నాయకుడు పొట్లూరి వి ప్రసాద్ పై పిర్యాదు నేపథ్యంలోనే ఇలాంటి అనుభవాన్ని చవిచూసిన పోలీసులు ఈ సారి వెంటనే తేరుకుని.. నిందితులను వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలావున్నాయి.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నివసిస్తున్న సయ్యద్ అహ్మద్ హుస్సేన్ జాఫ్రి (71)కి జూబ్లిహిల్స్ లోని ఓ భూమి విషయంలో స్థానికుడైన అరిఫ్ అనే వ్యక్తితో వివాదం నెలకొంది. దీంతో రోడ్డు నెంబరు 86లో వున్న తన ఇంట్లో నివసిస్తున్న అరిప్ పై మంగళవారం రాత్రి దాడి చేశారు. దీంతో జాఫ్రిపై అరిఫ్ పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో బుధవారం పోలీసులు వారిని విచారణకు పిలిచేందుకు వెళ్లారు. అయితే పోలీసులను చూడంగానే జాఫ్రి సహా కుటుంబసభ్యులు.. గది తలుపు పెట్టేసుకున్నారు. అంతటితో ఆగని నిందితులు పోలీసులపైకి వారి పెంపుడు కుక్కలను వదిలారు.
ఇదే తరహా ఘటన సిని నిర్మాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోట్లూరి వి ప్రసాద్ పోలీసుల ఎదుట హాజరుకాకుండా తప్పించుకోవడంతో అతన్ని తీసుకుంచ్చేందుకు వెళ్లిన పోలీసులపైకి జాగిలాలను వదిలిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఘటనను గుర్తుకు తెచ్చుకున్న పోలీసులు.. వెంటనే ఉన్నాతాధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. మరికొంతమంది పోలీసు బలగాలను జాఫ్రి ఇంటికి పంపించారు ఉన్నతాధికారులు. అయితే నిందితులు ఏమాత్రం భయపడకుండా పోలీసులకు కత్తులు చూపించారు. వాటితో తాము గాయాలు చేసుకుంటామని పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.
ఇక అవకాశం లభించిందని బావించిన నిందితులు ఎదురుగా వున్న పోలీసులపైకి లోపలి నుంచి వాటర్ బాటిళ్లను విసిరారు. అదే సమయంలో వారిక కంట పడకుండా ఇంటి వెనుక నుంచి పరారయ్యారు. అనుమానం వచ్చిన పోలీసుల్లో కొందరు వెనుక వైపుకు చేరుకునే సరికి పారిపోతున్న నిందితులను వెంబడించి పట్టుకున్నారు. నిందితులకు సహకరించిన జబీనా (30), షబానా బేగం (25)లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అలాగే, శునకాలను ఉసిగొల్పి విధులకు ఆటంకం కలిగించినందుకు నిందితులపై మరో కేసు కూడా నమోదైంది. నిందితులుపై భారత శిక్షాస్మృతి కింద 332, 353., 504, 506, 109 r/w 34 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more