వడ పావ్.. భారతదేశంలో అత్యధిక ప్రజలకు ఇష్టమైన, రుచికరమైన చిరుతిండి ఏదీ అంటే అదే వడా పావ్. చిన్నారులు చాట్ లలో వడా పావ్ ను తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొందరు వడను శెనగపిండితో చేస్తే.. ఇంకొందరు ఆలుగడ్డలతో కూడా తయారు చేస్తుంటారు. దీనికి పావ్ జోడించి నెయ్యి, చాట్ మసాలా వేసి వేయిస్తే.. దాని రుచికి రాదు ఏదీ సాటి. అందుకే పిల్లలు ఎక్కువగా తింటారు. అయితే, మన వద్ద సాధారణ వడ పావ్ మాత్రమే దొరుకుతుంది. కానీ, ఇప్పుడు బంగారు వడ పావ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఎక్కడంటే..
మొన్న బంగారం బిర్యానీని.. నిన్న బంగారం ఐస్క్రీమ్ను వడ్డించిన దుబాయ్లో.. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్లో బంగారు వడ పావ్ కూడా దొరుకుతున్నది. 22 క్యారెట్ల బంగారం పూతతో వడ పావ్ను కస్టమర్లకు అందిస్తూ తమ వ్యాపారాన్ని బంగారుమయంగా చేసుకుంటున్నారు. వడ పావ్ను అందరి మాదిరిగా సింపుల్గా ఇస్తే ఏం స్పెషల్ ఉంటుందని ఆలోచించిన ఓ సంస్థ.. బంగారం వడ పావ్ను వేడివేడిగా వడ్డిస్తున్నది. ఇదే ప్రపంచంలో తొలి 22 క్యారెట్ బంగారం పూతతో చేసిన వడ పావ్గా కూడా గుర్తింపు పొందింది.
అల్ కరామాలో ఉన్న ఓ పావో అనే రెస్టారెంట్ భారతీయ వంటకాలను అందించడానికి ప్రసిద్ధి చెందింది. వెన్న, చీజ్తో తయారు చేసి వేయించిన తర్వాత వాటిని తినేందుకు వీలున్న 22 క్యారెట్ గోల్డ్ రేకుతో కప్పి వడ్డిస్తున్నారు. నోరూరించే ఈ గోల్డెన్ వడ పావ్ ధర కూడా అందుబాటులోనే ఉంచారు. దీని ఖరీదు 100 అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్లు (దాదాపు రూ.2,000) గా నిర్ణయించారు. ఈ గోల్డెన్ వడ పావ్ ను డైన్-ఇన్ ఎంపికకు మాత్రమే అందుబాటులో ఉంచారు.
#Gold_Vada_Paav This is what's wrong with the world: too many rebels without a cause. pic.twitter.com/JKeKsgOLEo
— Masarat Daud (@masarat) August 30, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more