తెలంగాణలో ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తప్పుకుని ఆ పదవిని తన తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అప్పగించనున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్న వేళ.. ఆయనకు సీఎం పదవిని అప్పగించనున్నారన్న వార్తలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ అటు కాంగ్రెస్, ఇటు బీజేపి నేతలు కేటీఆర్ అర్హతలను ప్రశ్నించగా, తెలంగాణ ఇంటి పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చెరుకు సుధాకర్ మరో అడుగు ముందుకేసీ.. ఉద్యమ పార్టీలో వారసత్వానికి చోటు ఎక్కడి ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రజలకు చెప్పిన కేసీఆర్.. తన పార్టీ అధికారంలోకి రాగానే ఆఘమేఘాల మీద సీఎం పీఠాన్ని అధిరోహించారని విమర్శించారు. తెలంగాణకు తాను కాపాలాదారుగా మాత్రమే ఉంటానని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ అధినేత.. మాయమాటలతో తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేలా కొత్త ఆశలు కల్పించి.. అధికారంలోకి రాగానే వాటిని తుంచడం ఆయనకు పరిపాటిగా మారిందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న ముఖ్యమంత్రి కనీసం ఊరికో ఉద్యాగాన్ని కూడా కల్పించలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా అన్ని పార్టీలను, నేతలను కలుపుకుపోయిన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ పోరులో కలిసివచ్చిన పార్టీలను అణిచివేసి.. నాయకులను తొక్కేసి.. పార్టీలో నియంతలా మారి.. ఇప్పడు తన తనయుడికే ముఖ్యమంత్రి పీఠాన్ని పట్టం కట్టాలని చూస్తున్నారని సుధాకర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే బీసీలకు న్యాయం జరుగుతుందని అప్పటి యూపీఏ చైర్ పర్సెన్ సోనియాగాంధీ భావించారని.. కానీ తెలంగాణలో బీసీలను కూడా ఎదగనీయడం లేదని ఆయన అవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో తెలంగాణలో బీసి నేతలు ఎదగాలంటే.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటుగా ఆది నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉధ్యమంలో పాటుపడి.. జైలుకు వెళ్లి, పోలీసుల లాఠీల దెబ్బలు తిన్న బీసి నేత ఈటెల రాజేందర్ ను ముఖ్యమంత్రిని చేయాలని చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచి వున్న నేతలు వదలిపెట్టి.. మధ్యలో ఉద్యోగాలు వదిలేసిన నేతలకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కోదండరామ్ కు ఎన్డీయే నేతలు ఎందుకు మద్దతిస్తున్నారో తెలియడం లేదని అన్నారు. తాను కమ్యూనిస్టు ఉద్యమాల్లో తరచూ పాల్గొంటున్న వాడినని, తాను విజయం సాధిస్తే, విద్యావంతుల సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. తనను గెలిపించాలని పట్టభద్రులను ఆయన కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more