కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలు, కళాశాలలు మూతపడి అన్ లాక్ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న నేపథ్యంలో ఈ పాటికే పలు విద్యాసంస్థలకు పరీక్షలు జరగాల్సి వున్నా.. కొంత ఆలస్యంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో వరుసగా పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తున్నాయి ప్రభుత్వాలు. క్రితం రోజునే సీబీఎస్ఈ పరీక్షల తేదీలు కేంద్ర మంత్రి విడుదల చేసిన నేపథ్యంలో తమ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారా..? అని ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఆ సుమూర్తం కూడా రానేవచ్చింది.
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇవాళ రాష్ట్ర పదో తరగతి పరీక్షలకు షెడ్యూల్ ను విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఏడాది ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. సైన్సు సబ్జెక్టుకు మాత్రం రెండు పేపర్లు ఉంటాయి. సైన్సులో ఒక్కో పేపరుకు 50 మార్కులు కేటాయించారు. మరోవైపు పదో తరగతి విద్యార్థులకు జూన్ ఐదో తేదీ వరకు క్లాసులు జరగనున్నాయి. మే 3 నుంచి 10 వరకు ఇతర తరగతులకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల అనంతరం సెలవుల తర్వాత జులై 21 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.
పదోతరగతి పరీక్షల షెడ్యూల్
తేదీ పరీక్ష
07.06.2021 ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్ ఏ) & (కాంపోజిట్ కోర్సు)
08.06.2021 సెకెండ్ లాంగ్వేజ్
09.06.2021 ఇంగ్లీష్
10.06.2021 మ్యాథమెటిక్స్
11.06.2021 ఫిజికల్ సైన్స్
12.06.2021 బయోలాజికల్ సైన్స్
14.06.2021 సోషల్ స్టడీస్
15.06.2021 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్2 (కాంపోజిట్ కోర్సు)
ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
16.06.2021 ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)
ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more