ఉన్నతాధికారులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసే కార్మికులు, కార్మిక సంఘాల నేతలను ఇప్పటివరకు చూశాం, అంతెందుకు పార్టీ అధిష్టానంపై ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు పార్టీ నేతలు కూడా తిరుగుబాటు ఎగురవేయడం చూస్తూనే వుంటాం. కానీ అటు రక్షణశాఖ, ఇటు పోలీసు(హోం) శాఖలో మాత్రం ఉన్నతాధికారులంటే ఎంతో గౌరవమర్యాదలతో కూడుకుని వుంటారు, అప్పడప్పుడు ఒక్కటి రెండు సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేయడం కోసం కథనాయకులో లేక వారి తరపు వారో ఇలా చేస్తుంటారు. కానీ అదేంటో నిజంగానే ఒక పోలీసు ఉన్నతాధికారపై కానిస్టేబుళ్లు దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ఆ పోలీసు ఉన్నతాధికారి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉమ్ పున్ తుఫాను కారణంగా సహాయక చర్యల కోసం 500 మంది కానిస్టేబుళ్లకు ఆన్ డ్యూటీ వేశారు. అయితే, వాళ్లు తాత్కాలికంగా బస ఏర్పాటు చేసిన బ్యారక్లో.. వారితో పాటు ఉంటున్న ఓ ఎస్సైకి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో కానిస్టేబుళ్లు కంగారెత్తిపోయి.. తమ బ్యారెక్ ను పరిశుభ్రం చేయడంతో పాటు శానిటైజ్ చేయాలని సంబంధిత అధికారులను కోరారు. అయినా.. ఉన్నతాధికారులు ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. దీంతో కానిస్టేబుళ్లు డీసీపీ నివాసముంటున్న ప్రాంతానికి వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
దీంతో డీసీపీ పాల్ బయటకు వచ్చి వారిని శాంతించే ప్రయత్నం చేశారు. చర్చలు జరుగుతుండగానే.. సమూహంలోని కానిస్టేబుళ్లు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. కంటైన్మెంట్ జోన్లలో పని చేస్తున్నా సరిపడా మాస్కులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. ప్రాణభయంతో డీసీపీ పరుగెత్తగా అలర్ట్ అయిన ఇతర పోలీసులు డీసీపీని రక్షించి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో యావత్తు దేశం షాక్కు గురైంది. పోలీస్ శాఖలో ఇంత పెద్ద దాడి ఇదే. కాగా, నిన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘటనా స్థలాన్ని సందర్శించి కానిస్టేబుళ్లతో చర్చించారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more