అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇస్టానుసారంగా హామీలు గిప్పించిన పార్టీలు అధికారం అందుకోగానే ప్రతిపక్షాల కార్యకర్తలను టార్గెట్ చేసి వారిపై పోలీసులతో వేధింపులకు గురిచేస్తారా.? అదికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపైకి పోలీసులను ఉసిగోల్పి వారు అత్మహత్యకు పాల్పడేలా ఉరిగొల్పుతారా.? అంటూ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన అధికార వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నీతి, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తానని ప్రగాల్భాలు పలికిన పార్టీ అధికారంలోకి రాగానే.. ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు తమ పార్టీ కార్యకర్తపై వేధింపులకు పాల్పడతారా? అని ఫైర్ అయ్యారు. తమ పార్టీ కార్యకర్తపై వేధింపులకు పాల్పడిన పోలీసులపై తక్షణం పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార వైసీపీ ప్రభుత్వానికి చెందిన పెద్దలు దొడ్డిదారిన అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నా పట్టించుకోని పోలీసులు.. దానిపై ప్రశ్నించిన జనసేన కార్యకర్తలను మాత్రం టార్గెట్ చేసి.. వేధింపులకు గురిచేస్తున్నారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
పోలీసులు ప్రజలకే జవాబుదారీ.. అధికార పక్షానికి కాదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన జనసేన కార్యకర్త ఉన్నమట్ల లోకేశ్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని ప్రశ్నించినందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోంది. జనసేన కార్యకర్త ఆత్మహత్యకు ప్రేరేపించిన పోలీసు అధికారి రఘుపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీతో పాటు అధికార పార్టీ చేస్తున్న ఇసుక దందా, ఇతర అక్రమాలను కలెక్టర్ దృష్టికి తీసుకెవెళ్లాలని నాయకులకు సూచించారు. లోకేశ్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచి ధైర్యం చెప్పాలని స్థానిక నాయకత్వానికి నిర్దేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more