తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తూ ఉంది. బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. అయినా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో బయటకు రావాలనుకునే వారు తప్పకుండా ప్రభుత్వ అదేశాలను పాటించాల్సిందే. కరోనావైరస్ వ్యాప్తి ఇంతింతై వటుడింతై అంటూ వ్యాప్తి చెందుతున్న తరుణంలో మూడో దశకు చేరుకుందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు ఇకపై తప్పనిసరిగా తమ అదేశాలను పాటించాల్సిందేనని హెచ్చరించింది.
అయితే తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఏమిటనగా.. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యయిక పరిస్థితుల్లో బయటకు వస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. లాగే విధుల్లో ఉన్న ఉద్యోగులందరూ మాస్క్లు ధరించాలంటూ స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు కూడా మాస్క్లు పెట్టుకోవాలంటూ ఆదేశాలు విడుదల చేసింది. బయట దొరికే మాస్కులతో పాటు ఇళ్లలో తయారు చేసిన మాస్క్లను కూడా ధరించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు మాస్క్లు ధరించడం తప్పనిసరి చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్లు పెట్టుకోకుంటే అరెస్టుతో పాటు జరిమానాలు విధిస్తున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో తెలంగాణ చేరింది. ఓ అధ్యయనం ప్రకారం మాస్కుల వినియోగంతో జపాన్లో కరోనా కేసుల వ్యాప్తి తగ్గినట్లు తేలడంతో దేశంలో ఈ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. దగ్గడం, తుమ్మడం, మాట్లాడే సమయాల్లో వెలువడే తుంపర్లు అవతలి వ్యక్తిపై పడటంతో కోవిడ్-19 వ్యాపిస్తుంది. దానిని అరికట్టాలంటే ఈ మేరకు నిర్ణయం తప్పదని ప్రభుత్వం అభిప్రాయం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more