తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చింది. ఇటు ప్రభుత్వం అటు కార్మికులు బెట్టువీడకపోవడంతో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందుకులు గురవుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్భందులు పడుతున్నారని వ్యాఖ్యానించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం తక్షణం చర్చలు నిర్వహించి.. వారి సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు అదేశాలు జారీ చేసింది.
అయితే ప్రభుత్వం కానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్టీసీ సమ్మెను మరింత ఉదృతం చేయాలని నిర్ణయించింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భేటీ అయిన ఆర్టీసీ జేఏసీ నేతలు, అఖిలపక్ష నేతలు తమ కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చేపట్టే అన్ని కార్యక్రమాలకు మద్దతు ప్రకటించాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు.
నిధులు పుష్కలంగా వున్న తెలంగాణలోనే ఆర్టీసిని ప్రైవేటు పరం చేయాలని నేతలు పట్టుబడుతుండగా, అటు నిధుల లేమితో భాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సంతకంతో ఆర్టీసీ కార్మికులందరినీ అక్కడి ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేశారని కార్మిక సంఘాల నేతలు వాఖ్యనిస్తున్నారు. తమ ప్రధాన డిమాండును నెరవేర్చేవరకు తమ సమ్మె అగబోదని కార్మికులు భీష్మించుకున్నారు. ఆర్టీసీని టీఎస్ఆర్టీసీలో విలీనం చేసి.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.
జాయింట్ యాక్షన్ కమిటీ ప్రణాళికలో భాగంగా ఇవాళ ఆర్టీసీ కార్మికులు.. తమ కుటుంబాలతో కలసి ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను విధులకు రావద్దని కోరారు. బస్సులో ప్రయాణించేవారికి టికెట్లు ఇచ్చి, ఆర్టీసీకి మరింత నష్టం చేకూరకుండా వ్యవహరించాలని సూచించారు. 23వ తేదీన ప్రజాప్రతినిధులను కలిసి తమ డిమాండ్లను వివరించాలని నిర్ణయించారు.
26న ఆర్టీసీ కార్మికులు పిల్లలతో ధర్నా చేయనున్నారు. 27న ఆర్టీసీ కుటుంబసభ్యులతో కలసి వామపక్ష నేతలు, కార్యకర్తలు కుటుంబాలు భోజనాలు చేయనున్నారు. 28, 29న నిరసన ప్రదర్శలను చేపట్టనున్నారు. 30న సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు 10 రోజుల కార్యాచరణను సిద్ధం చేశారు. అప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే.. తమ సమ్మె మాత్రం యధాతథంగా కొనసాగుతుందని.. ఆ తరువాత కార్యచరణను మరోమారు కూర్చోని నిర్ణయిస్తామని నేతలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more